Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో తెదేపా ధర్నాను నేను స్వాగతిస్తున్నా: కేకే

Webdunia
తెలుగుదేశం పార్టీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తెలుగుదేశం పార్టీకి పరస్పరం మద్దతు పలుకుతూ ప్రజల్లో ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. శనివారం అమరవీరులకు నివాళులర్పించిన తెలంగాణా తెలుగుదేశం పార్టీ నాయకులు ఢిల్లీలో ధర్నాకు బయలుదేరేందుకు సిద్ధమయ్యారు.

తెలుగుదేశం చేపట్టనున్న ధర్నాను తాను స్వాగతిస్తున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కె.కేశవరావు వ్యాఖ్యానించారు. అంతేకాదు తెలంగాణా సాధనకోసం తమవెంట తెలుగు తమ్ముళ్లు కలిసి రావాలని పిలుపునిచ్చారు.

డిసెంబరు దాకా తెలంగాణాకోసం ఆగటం ఎందుకనీ, అంతకంటే ముందే తెలంగాణా రావాలని తెలుగుదేశం పార్టీ చేస్తున్న ధర్నాకు తాను పూర్తి మద్దతు పలుకుతున్నట్లు చెప్పారు. అంతేకాదు తెలంగాణాకు ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే ఖబడ్దార్ అని హెచ్చరించారు.

తెలంగాణా వస్తే తెలంగాణాలోని తెదేపా-కాంగ్రెస్ రెండు పార్టీల నాయకులు ఏకమవుతారేమోనని చాలామంది బహిరంగంగానే అనుకుంటున్నారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు కానీ శత్రువులు కానీ ఉండరన్నట్లు అది కూడా జరుగుతుందేమో చూద్దాం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అసలు మీ సమస్య ఏంటి? జర్నలిస్టుపై మండిపడిన పూజాహెగ్డే

పూజా హెగ్డేలో ప్రేమలో పడింది.. ఘాటుగా లిప్ కిస్.. ట్రెండింగ్‌లో బుట్టబొమ్మ (video)

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

మండుతున్న అగ్నిగోళం నుంచి చందమామ చల్లగా ఎలా మారాడు? 4.5 బిలియన్ ఏళ్ల క్రితం (video)

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

Show comments