Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహు కేతువులు పోయారు.. జేఏసీ పునీతమైంది: తెరాస

Webdunia
తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ నుంచి రాహు (కాంగ్రెస్) కేతువు (తెదేపా)లు పోయారని, అందువల్ల ఐకాస పునీతమైందని తెలంగాణ రాష్ట్ర సమితి నేత, కేసీఆర్ తనయుడు కె.తారకరామారావు అభిప్రాయపడ్డారు. జేఏసీ నుంచి తెలుగుదేశం పార్టీని బహిష్కరించడం పట్ల ఆయన స్పందనను శనివారం వ్యక్తం చేశారు.

ప్రధాన పార్టీలుగా చెప్పుకుంటున్న కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు జేఏసీ నుంచి తప్పుకోవడం పట్ల తెలంగాణ ఉద్యమం మరింత బలపడుతుందన్నారు. 'వంట సిద్ధమైన తర్వాత గంటలు ఊపేందుకు' వచ్చిన ఈ రెండు పార్టీలు బయటకు వెళ్లడమే మంచిదన్నారు. దీనివల్ల ఐకాస పునీతం కావడమే కాకుండా, మరింతగా బలపడుతుందన్నారు.

ఇకపోతే.. కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సమితి అనుబంధ సంస్థగా ఐకాస మారిందని ఆరోపించారు. తెలంగాణ ఇచ్చేది కాంగ్రెస్సే.. తెచ్చేది కాంగ్రెస్సేనని ఆయన జోస్యం చెప్పారు. అందువల్ల జేఏసీ ఉన్న లేకపోయినా ఒక్కటేనన్నారు. అంతేకాకుండా, జేఏసీని తాము ఆది నుంచి వ్యతిరేకిస్తున్నట్టు కోమటిరెడ్డి గుర్తు చేశారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments