Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయ నేతగా కాదు.. ఓ సీమవాసిగా వెల్లడించా: జేసీ

Webdunia
శనివారం, 13 మార్చి 2010 (11:13 IST)
రాయలసీమ ప్రాంతాన్ని తెలంగాణ ప్రాంతంలో విలీనం చేయాలని చెప్పడం ఒక రాజకీయ నేతగా వెల్లడించిన అభిప్రాయం కాదని, ఒక సాధారణ సీమవాసిగా చెప్పానని మాజీ మంత్రి జేసీ.దివాకర్ రెడ్డి అన్నారు. ఇందులో ఎలాంటి స్వలాభాలు లేవన్నారు.

రాష్ట్రం విడిపోతే సీమ ప్రాంతానికి ఎదురయ్యే నీటి సమస్యలపై ఆందోళన చెందే సామాన్య వ్యక్తిగా చెప్పానని ఆయన వివరణ ఇచ్చారు. అంతేకాకుండా, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల మధ్య ఉన్న సంస్కృతితో పాటు.. ఇతర పోలికలను ఆయన వివరించనున్నారు.

రాయలసీమ రీజియన్ ఒకపుడు నిజాం పాలనలో ఉండేదని ఆ తర్వాత బ్రిటీష్ రాజు పాలనలోకి ఎలా వెళ్లిందనే విషయంపై ఆయన వివరించనున్నారు. అలాగే, ఈ రెండు ప్రాంతాల్లో ఉండే సంస్కృతీ సంప్రదాయాలను కూడా గుర్తు చేయనున్నారు. ప్రధానంగా, సీమ, తెలంగాణలలో కల్లు ఏ విధంగా ప్రాచూర్యం పొందిందో కూడా ఆయన వివరించనున్నారు.

అంతేకాకుండా, ఇరు ప్రాంతాలకు చెందిన ప్రజలు విశాల భావాలు కలిగిన వారే కాకుండా ముక్కుసూటి మనుషులన్నారు. అందువల్లే రాయలసీమ ప్రాంతాన్ని తెలంగాణలో ఉంచాలని ఒక రాజకీయనేతగా కాకుండా, సాధారణ సీమవాసిగా కోరుతున్నట్టు చెప్పారు.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments