Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్ర ఏర్పాటుకు ఇంటి దొంగల మోకాలడ్డు: యాష్కీ

Webdunia
శుక్రవారం, 15 జనవరి 2010 (15:26 IST)
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తెలంగాణ వాదులే అడ్డుతగులుతున్నారని నిజామాబాద్ లోక్‌సభ సభ్యుడు మధు యాష్కీ ఆరోపించారు. ఆయన శుక్రవారం నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ఏర్పాటుకు ఇంటి దొంగలే ప్రధాన అడ్డంకిగా ఉన్నారన్నారు.

తాము రాజీనామాలపై వెనక్కి తగ్గేది లేదన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యేంత వరకు తాము విశ్రమించబోమన్నారు. అయితే, తమ లక్ష్య సాధనలో కొందరు తెలంగాణ వాదులే అడ్డు తగులుగుతున్నారని ఆయన ఆరోపించారు. ఇలాంటి వారికి అడ్డుకట్ట వేయాలని ఆయన కోరారు.

ఇకపోతే.. తెలంగాణ ఉద్యమంలో మావోయిస్టులు చేరినట్టు వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. ఇందులో మావోలు ఉన్నదీ లేనిదీ పోలీసులే తేల్చాలని చెప్పారు. అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువ అవుతుందని డీజీపీ గిరీష్ కుమార్ వ్యాఖ్యలు చేయడం సరికాదని, ఇవి రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేవిగా ఉన్నట్టు తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగ్ ఉన్నందున హాజరుకాలేదు.. కాస్త సమయం ఇవ్వండి : ఈడీని కోరిన మహేశ్ బాబు

కాశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్‌ను అలా వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు: విజయ్ దేవరకొండ

మాలీవుడ్‌‍ను కుదిపేస్తున్న డ్రగ్స్... మరో ఇద్దరు దర్శకులు అరెస్టు

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

Show comments