Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖ్యమంత్రి రోశయ్య పితృసమానులు: మంత్రి సురేఖ

Webdunia
బుధవారం, 28 అక్టోబరు 2009 (11:13 IST)
ముఖ్యమంత్రి రోశయ్య తనకు పితృసమానులని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమాభివృద్ధి శాఖామంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. ఆయనతో తనకు ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవన్నారు. ఒక కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యురాలిగా పార్టీ అధిష్టానం ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటానని స్పష్టం చేశారు.

దీనిపై ఆమె మాట్లాడుతూ.. తాను ముఖ్యమంత్రి రోశయ్యకు అనుకూలంగా మారినట్టు వస్తున్న భిన్నకథనాలు అర్థరహితమన్నారు. తన రాజకీయ గురువు తనయుడు వైఎస్.జగన్‌కు హాని కలుగుతుందని భావిస్తే తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆమె ప్రకటించారు.

పదవులు శాశ్వతం కాదని, మానవ సంబంధాలు ముఖ్యమంత్రి ఆమె తేల్చి చెప్పారు. వైఎస్ మృతి అనంతరం తాను రాజీనామాకు సిద్ధపడితే ప్రభుత్వ సలహాదారు వైఎస్ ప్రాణ స్నేహితుడు కేవీపీ. రామచంద్రరావు వద్దని సలహా ఇచ్చారన్నారు. ఆయన సూచనతో తాను ఆ ఆలోచన నుంచి విరమించుకున్నానని ఆమె వెల్లడించారు.

ఇంతకాలం జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ బహిరంగంగా ప్రకటనలు చేసిన సురేఖ సోమవారం రోశయ్యకు అనుకూలంగా మాట్లాడటంతో మీడియాలో విభిన్న కథనాలు వచ్చాయి. దీనిపై ఆమె మంగళవారం వివరణ ఇచ్చారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Show comments