Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోనియా గాంధీ పర్యటనలో మళ్లీ మార్పులు

Webdunia
FileFILE
కాంగ్రెస్ అధినేత్రి, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ ఈనెలలో జరుపతలపెట్టిన రాష్ట్ర పర్యటనలో మళ్లీ స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ పర్యటనలో భాగంగా ఈనెల 17వతేదీన ఆమె విజయవాడకు రావాల్సి వుంది. అయితే, ఈ పర్యటన రద్దు అయింది. విజయవాడకు బదులు ఆమె నేరుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. ఢిల్లీ నుంచి ఆమె ప్రత్యేక విమానంలో బేగంపేటకు ఉదయం 10.15 చేరుకుంటారు.

ఎయిర్ పోర్టు ఆవరణలో స్వయం సహాయక గ్రూపులతో 15 నిమిషాల సేపు ఇస్టాగోష్టి కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడ నుంచి హెలికాఫ్టర్‌లో మెదక్ జిల్లా కంది గ్రామానికి చేరుకుంటారు. అక్కడ ఐఐటికి శంకుస్థాపన చేస్తారు. అక్కడి నుంచి తిరిగి బేగంపేట విమానాశ్రయానికి 11 గంటలకు వస్తారు.

ఆ తర్వాత ఖమ్మం జిల్లా కొత్తగూడెంకు వెళ్లి గిరిజన సభలో పాల్గొని, 12.05 నిమిషాలకు హైదరాబాద్‌కు చేరుకుంటారు. 1.45 నిమిషాలకు హైదరాబాద్‌ నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన ఇందిరాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. 2.15 నిమిషాలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభకు హాజరై, 3.30 నిమిషాలకు తిరిగి ఢిల్లీకి బయలుదేరి వెళతారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments