రాను రాను ప్రజల్లో ఆధ్యాత్మిక చింతన తగ్గిపోతుందని, ఇది ప్రమాదకరమి కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి అన్నారు. ముఖ్యంగా పిల్లల్ని సంస్కరించేందుకు తమ పీఠం ద్వారా ప్రత్యేక కార్యక్రమం చేస్తున్నట్లు చెప్పారు.
విజయవాడలో ఒక ధార్మిక కార్యక్రమానికి శంకర మఠం వచ్చిన స్వామి మీడియాతో మాట్లాడారు. వచ్చే వేసవిలో పిల్లలకు ఉచితంగా నీతి కథలు, ఆధ్యాత్మిక కథల పుస్తకాలు పంపిణీ చేస్తామని చెప్పారు. ఉపాధ్యాయులకు దేశవ్యాప్తంగా శిక్షణ ఇచ్చేందుకు తమ కంచి కామకోటి పీఠం విస్తృత ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు.