Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిర్ ఇండియాకు రూ.1200 కోట్ల ఈక్విటీ నిధులు: ప్రఫుల్

Webdunia
శుక్రవారం, 31 డిశెంబరు 2010 (10:39 IST)
నష్టాల ఊబిలో ఉన్న ఎయిర్ ఇండియా సంస్థను ఆదుకునేందుకు కేంద్రం సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇందులోభాగంగా ఈ సంస్థకు 1200 కోట్ల రూపాయల ఈక్విటీ నిధులను సమకూర్చనుంది. ఈ విషయాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి ప్రఫుల్ పటేల్ ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం అనంతరం వెల్లడించారు.

ఈ సొమ్ముతో ఎయిరిండియా సంస్థాగత పునర్నిర్మాణంతో పాటు ఆర్థిక వనరులు కూడా పెరుగుతాయని ఆయన అన్నారు. అంతేకాకుండా, ఎయిర్ ఇండియాలో 25 వేల మంది ఉద్యోగుల వేతనాలను హేతుబద్ధం చేయాలన్న షరతును కూడా విధించింది.

ఇదిలావుండగా, ఎయిర్ ఇండియాకు ఈ యేడాదిలో కేంద్రం నిధులు సమకూర్చడం ఇది రెండోసారి కావడం గమనార్హం. గతంలో ఫిబ్రవరిలో పునరుజ్జీవ ప్రణాళిక కింద 800 కోట్లు అందజేసింది. సంస్థ పనితీరు ప్రాతిపదికన దశలవారీగా ఎయిరిండియాకు ప్రభుత్వం ఈక్విటీని అందిస్తున్నదని సంస్థ వర్గాలు తెలిపాయి.

దీంతో పాటు ఖర్చు తగ్గింపులో భాగంగా 25 వేల మంది ఉద్యోగుల వేతనాలను హేతుబద్ధం చేయాలని నిర్ణయించగా, దీనికి ఉద్యోగ సంఘాల యూనియన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అలాగే, బకాయిల చెల్లింపును కూడా మరో మూడేళ్ళ పాటు వాయిదా వేయాలని కేంద్రం భావిస్తోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Show comments