Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిర్ ఇండియాకు రూ.1200 కోట్ల ఈక్విటీ నిధులు: ప్రఫుల్

Webdunia
శుక్రవారం, 31 డిశెంబరు 2010 (10:39 IST)
నష్టాల ఊబిలో ఉన్న ఎయిర్ ఇండియా సంస్థను ఆదుకునేందుకు కేంద్రం సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇందులోభాగంగా ఈ సంస్థకు 1200 కోట్ల రూపాయల ఈక్విటీ నిధులను సమకూర్చనుంది. ఈ విషయాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి ప్రఫుల్ పటేల్ ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం అనంతరం వెల్లడించారు.

ఈ సొమ్ముతో ఎయిరిండియా సంస్థాగత పునర్నిర్మాణంతో పాటు ఆర్థిక వనరులు కూడా పెరుగుతాయని ఆయన అన్నారు. అంతేకాకుండా, ఎయిర్ ఇండియాలో 25 వేల మంది ఉద్యోగుల వేతనాలను హేతుబద్ధం చేయాలన్న షరతును కూడా విధించింది.

ఇదిలావుండగా, ఎయిర్ ఇండియాకు ఈ యేడాదిలో కేంద్రం నిధులు సమకూర్చడం ఇది రెండోసారి కావడం గమనార్హం. గతంలో ఫిబ్రవరిలో పునరుజ్జీవ ప్రణాళిక కింద 800 కోట్లు అందజేసింది. సంస్థ పనితీరు ప్రాతిపదికన దశలవారీగా ఎయిరిండియాకు ప్రభుత్వం ఈక్విటీని అందిస్తున్నదని సంస్థ వర్గాలు తెలిపాయి.

దీంతో పాటు ఖర్చు తగ్గింపులో భాగంగా 25 వేల మంది ఉద్యోగుల వేతనాలను హేతుబద్ధం చేయాలని నిర్ణయించగా, దీనికి ఉద్యోగ సంఘాల యూనియన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అలాగే, బకాయిల చెల్లింపును కూడా మరో మూడేళ్ళ పాటు వాయిదా వేయాలని కేంద్రం భావిస్తోంది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments