Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశాన్ని పాలిస్తున్న మంత్రగత్తె : నరేంద్ర మోడీ ధ్వజం

Webdunia
శుక్రవారం, 11 ఏప్రియల్ 2014 (16:09 IST)
File
FILE
భారతదేశాన్ని గత దశాబ్దకాలంగా ఓ మంత్రగత్తె పాలిస్తోందని భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పరోక్షంగా సోనియాగాంధీని విమర్శించారు. భారతీయ జనతాపార్టీ ఓ మాంత్రికుడిని తెచ్చిందని, ఆయన రాత్రికి రాత్రే అంతా మార్చేస్తానంటున్నాడని తనను ఉద్దేశించి సోనియా చేసిన వ్యాఖ్యలను ఆయన జంషెడ్ పూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోడీ ప్రస్తావించారు.

కేంద్ర ప్రభుత్వం ఓ మంత్రెగత్తెను తెచ్చిందని, ఆమె గత పదేళ్లుగా ఈ దేశాన్ని పాలిస్తోందని, తత్ఫలితంగా ఉపాధి అవకాశాలు గల్లంతయ్యాయని, రైతుల కష్టాలు పెరిగాయని ఆయన అన్నారు. మంత్రగత్తె వల్ల దేశం పదేళ్లుగా దుస్థితిలో ఉందని, తనను తాను కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రజల జీవితాలను కష్టాల్లో పడేసిందని మోడీ మండిపడ్డారు.

తాను చాలా పేద కుటుంబంలో పుట్టానని, అందువల్ల పేదల కష్టాలు తనకు తెలుసునని మోడీ అన్నారు. నోట్లో గోల్డెన్ స్పూన్‌తో పుట్టిన వాళ్లకు పేదల కష్టాలు ఎలా తెలుస్తాయని పరోక్షంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని సైతం ఆయన విమర్శలు గుప్పించారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments