Webdunia - Bharat's app for daily news and videos

Install App

దసరా ఉత్సవాలు.. బొమ్మల కొలువు విశిష్టత.. 5, 7, 9 మెట్లపై?

Webdunia
గురువారం, 12 అక్టోబరు 2023 (16:15 IST)
Navrathri kolu
నవరాత్రి ఉత్సవాన్ని జరుపుకునే అనేక మంది తమ తమ ఇళ్లలో బొమ్మల కొలువును వుంచుతారు. అయితే ఈ బొమ్మల కొలువును ఏర్పాటు చేసేందుకు కొన్ని నియమాలు వున్నాయి. సాధారణంగా 5, 7, 9 మెట్లపై బొమ్మల కొలువును వుంచాలి. 
 
దసరా నవరాత్రులలో ఈ సరదా బొమ్మల కొలువు పండగ జరుపుకుంటారు. దుర్గాదేవి రాక్షస విజయానికి గుర్తుగా ఈ పండగ జరుగుతుంది. దీని అలంకరణకు తొమ్మిది మెట్లుంటాయి. వారి కళాదృష్టి, ఆర్థిక స్థోమత, సౌకర్యాలను బట్టి వాళ్ళు ఈ మెట్లపై రకరకాల బొమ్మలను అమరుస్తారు. 
 
పైమెట్లపై దేవుళ్ళ బొమ్మలను ఉంచుతారు. అమ్మవారి బొమ్మలు కూడా వుంచే ఈచోటుని సత్వగుణానికి ప్రతీకగా నిర్వచిస్తారు. కింద వున్న మెట్లపై ప్రాపంచిక జీవితానికి సంబంధించిన బొమ్మలు వుంచు తారు. అవి తామస గుణాన్ని ప్రతిబింబిస్తాయని అంటారు. 
 
మధ్య భాగములో క్షత్రియధర్మాన్ని తెలుపుతూ ఉండే రాజు, రాణి, యుద్ధవీరుల వంటి బొమ్మల నుంచుతారు. ఇక అన్నిటికన్నా పై మెట్టు మీదవుంచే కలశం దేవీ కరుణకు సూచనగా భావిస్తారు. ఈ మూడు గుణాలను అధిగమించిన వారికి దేవీ కటాక్షము లభ్యమవుతుందని అంటారు. 
 
మెట్లపై తెల్లని వస్త్రము పరచి ఆ పై బొమ్మలను అమర్చుతారు. ప్రాంతీయ భేదాలవలన బొమ్మలను అమ ర్చడంలో కొన్ని భేదాలు కనిపిస్తాయి. దేవుని బొమ్మలైన వినాయకుడు, రాముడు, కృష్ణుడు, లక్ష్మి, సరస్వతి, పార్వతి, స్వాతంత్ర్య సమరయోధుల బొమ్మలు, పెళ్ళితంతు బొమ్మలు, హాస్యబొమ్మలు మొదలగునవి ఈ బొమ్మల కొలువలో అమర్చుతారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విద్య, సాంకేతికత భాగస్వామ్యంపై శాన్ డియాగో విశ్వవిద్యాలయం- తెలంగాణ ఉన్నత విద్యా మండలి

Bengaluru: వ్యాపారవేత్తపై కత్తితో దాడి- రూ.2కోట్ల నగదును దోచేసుకున్నారు

Hyderabad: టిప్పర్ లారీ ఢీకొని ఒకటవ తరగతి విద్యార్థి మృతి

EV Scooter: ఛార్జ్ అవుతున్న ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలి మహిళ మృతి

విజయనగరంలో బాబా రాందేవ్.. ఏపీలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి

అన్నీ చూడండి

లేటెస్ట్

Bonalu: హైదరాబాదులో బోనాల పండుగ ఎందుకు జరుపుకుంటారు? (video)

26-06-2025 గురువారం దినఫలితాలు - అనాలోచిత నిర్ణయాలు తగవు...

Hanuman Chalisa: జూలై చివరి వరకు అంగారక యోగం.. భయం వద్దు.. హనుమాన్ చాలీసా వుందిగా?

Vishnu Sahasranamam: విష్ణు సహస్రనామానికి మించిన మంత్రం లేదు.. స్తుతిస్తే ఎలాంటి ఫలితాలో తెలుసా?

Jagannath Yatra: జూన్ 27 నుంచి సికింద్రాబాద్‌లో పూరీ జగన్నాథ రథయాత్ర

తర్వాతి కథనం
Show comments