Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవరాత్రి స్పెషల్ : కట్టె పొంగలి ఎలా చేయాలి..

ముందుగా కుక్కర్లో బియ్యం, పెసరపప్పును కడిగి రెండింతలు నీరు పోసి ఉడికించుకోవాలి. రెండు లేదా నాలుగు విజిల్స్ వచ్చాక దించేయాలి. వెడల్పాటి బాణలిలో నెయ్యి వేసి వేడయ్యాక మిరియాలు, జీలకర్ర, అల్లం, జీడిపప్పు

Webdunia
సోమవారం, 11 సెప్టెంబరు 2017 (12:56 IST)
నవరాత్రి సందర్భంగా కట్టె పొంగలిని దుర్గాదేవికి సమర్పిస్తే సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం. అలాంటి కట్టె పొంగలిని ఎలా తయారు చేయాలో చూద్దాం.. 
 
కావలసిన  పదార్థాలు :
బియ్యం : ఒక కేజీ 
మిరియాల పొడి - ఒక స్పూన్ 
పెసర పప్పు- అరకేజీ 
అల్లం తురుము- ఒక స్పూన్
పంచదార - అరస్పూన్ 
ఉప్పు- అరస్పూన్ 
జీడిపప్పు- వంద గ్రాములు 
నెయ్యి- వంద గ్రాములు 
తాలింపుకు- జీలకర్ర, మిరియాలు ఒక స్పూన్ 
 
తయారీ విధానం :
ముందుగా కుక్కర్లో బియ్యం, పెసరపప్పును కడిగి రెండింతలు నీరు పోసి ఉడికించుకోవాలి. రెండు లేదా నాలుగు విజిల్స్ వచ్చాక దించేయాలి. వెడల్పాటి బాణలిలో నెయ్యి వేసి వేడయ్యాక మిరియాలు, జీలకర్ర, అల్లం, జీడిపప్పు వేసి దోరగా వేపుకోవాలి. తర్వాత మిరియాల పొడిని, జీలకర్ర పొడిని కూడా చేర్చుకోవాలి. ఇందులో ఉడికించిన అన్నాన్ని చేర్చుకోవాలి. ఉప్పు, పంచదార వేసి బాగా కలపాలి. చివర్లో రెండు స్పూన్ల నెయ్యిని చేర్చి దించేయాలి. ఆరిన తర్వాత అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: జగన్ రాఖీ శుభాకాంక్షలు.. ట్రోల్స్ మొదలు- దోచుకున్న దాన్ని దాచడానికి పోరాటం

జమ్మూ కాశ్మీర్‌కు చార్మిత్రాత్మక మైలురాయిగా మొదటి సరుకు రవాణా రైలు

కుల్గాంలో ఇద్దరు సైనికులు అమరులయ్యారు, 9 మంది గాయపడ్డారు, ముగ్గురు ఉగ్రవాదులు హతం

లక్షద్వీప్ దీవులలోని ఉపాధ్యాయుల కోసం ఏఐ శిక్షణా కార్యక్రమం

Andhra Pradesh: ఇండియా జస్టిస్ రిపోర్ట్- 2025: రెండో స్థానానికి ఎగబాకిన ఆంధ్రప్రదేశ్

అన్నీ చూడండి

లేటెస్ట్

08-08-2025 శుక్రవారం ఫలితాలు - రుణ సమస్య నుంచి గట్టెక్కుతారు...

Raksha Bandhan 2025: రాఖీ పండుగ రోజున అరుదైన మహా సంయోగం.. ఏ టైమ్‌లో రాఖీ కట్టాలి?

శ్రావణ వరలక్ష్మి వ్రతం, పూజ విధానం

Varalakshmi Vratam 2025: బ్రహ్మ ముహూర్తంలో వరలక్ష్మీ వ్రతం చేస్తే సర్వం శుభం

Raksha Bandhan: రక్షాబంధన్ రోజున సోదరికి ఈ బహుమతి ఇస్తే.. అదృష్టం ఖాయం

తర్వాతి కథనం
Show comments