Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాత్రూమ్‌‌కు వెళ్లిన యువకుడిపై చిరుతపులి దాడి..

Webdunia
మంగళవారం, 22 జూన్ 2021 (11:30 IST)
హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రం షిమ్లా నగరంలో ఓ హృదయవిధారక ఘటన చోటుచేసుకుంది. బాత్రూమ్‌లో కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లిన ఓ యువకుడిపై చిరుతపులి దాడిచేసి తీవ్రంగా గాయపర్చింది. ప్రస్తుతం ఆ యువకుడు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. షిమ్లాలోని కృష్ణనగర్ ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళ్తే.. కృష్ణనగర్‌కు చెందిన గౌరవ్ సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు కాలకృత్యాలు తీర్చుకునేందుకు తన ఇంట్లోని బాత్రూమ్‌కు వెళ్లాడు. అయితే అప్పటికే బాత్రూమ్‌లో దూరి ఉన్న చిరుత అతనిపై దాడిచేసింది. అరుపులు విని అక్కడికి పరుగుతీసిన స్థానికులు చిరుతను బాత్రూమ్‌లోనే ఉంచి తలుపువేశారు. తీవ్రంగా గాయపడిన యువకుడిని ఆస్పత్రికి తరలించారు.
 
అనంతరం పోలీసులకు, అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. చిరుతకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి బంధించారు. అనంతరం తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో వదిలేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కన్నప్ప కోసం ఫైట్ మాస్టర్ గా మారిన మంచు విష్ణు

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments