Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాత్రూమ్‌‌కు వెళ్లిన యువకుడిపై చిరుతపులి దాడి..

Webdunia
మంగళవారం, 22 జూన్ 2021 (11:30 IST)
హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రం షిమ్లా నగరంలో ఓ హృదయవిధారక ఘటన చోటుచేసుకుంది. బాత్రూమ్‌లో కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లిన ఓ యువకుడిపై చిరుతపులి దాడిచేసి తీవ్రంగా గాయపర్చింది. ప్రస్తుతం ఆ యువకుడు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. షిమ్లాలోని కృష్ణనగర్ ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళ్తే.. కృష్ణనగర్‌కు చెందిన గౌరవ్ సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు కాలకృత్యాలు తీర్చుకునేందుకు తన ఇంట్లోని బాత్రూమ్‌కు వెళ్లాడు. అయితే అప్పటికే బాత్రూమ్‌లో దూరి ఉన్న చిరుత అతనిపై దాడిచేసింది. అరుపులు విని అక్కడికి పరుగుతీసిన స్థానికులు చిరుతను బాత్రూమ్‌లోనే ఉంచి తలుపువేశారు. తీవ్రంగా గాయపడిన యువకుడిని ఆస్పత్రికి తరలించారు.
 
అనంతరం పోలీసులకు, అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. చిరుతకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి బంధించారు. అనంతరం తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో వదిలేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments