Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మ బాటలో యోగి.. రూ. 3కే అల్పాహారం.. రూ.5కే కడుపునిండా భోజనం.. అన్నపూర్ణ భోజనాలయాస్ పేరిట?

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అమ్మ బాటలో పయనిస్తున్నారు. దేశంలో తొలిసారిగా తమిళనాడు రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి జయలలిత అమ్మ క్యాంటీన్లు పేరుతో చౌక ధరకే ఆహార పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ క్యాంటీ

Webdunia
శుక్రవారం, 5 మే 2017 (17:37 IST)
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అమ్మ బాటలో పయనిస్తున్నారు. దేశంలో తొలిసారిగా తమిళనాడు రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి జయలలిత అమ్మ క్యాంటీన్లు పేరుతో చౌక ధరకే ఆహార పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ క్యాంటీన్లు పేదలకు ఆకలిబాధను తీర్చుతున్నాయి. ఇదేవిధంగా యూపీ సీఎం యోగి కూడా పేద ప్రజల ఆకలిని తీర్చనున్నారు.  
 
ప్రజా సంక్షేమ విషయంలో ఏమాత్రం రాజీ పడని యోగి రోజు రోజుకీ దూకుడును పెంచుతున్నారు. తాజాగా పేదల ఆకలిని తీర్చడమే లక్ష్యంగా త్వరలో ఉత్తరప్రదేశ్‌లో రూ.5కే కడుపునిండా భోజన పథకాన్ని అమలు చేయనున్నట్లు యోగి సర్కారు వెల్లడించింది. ఈ విషయాన్ని సీఎం కార్యాలయ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
 
ఈ భోజన పథకం కింద రూ.3కే అల్పాహారం ఇస్తారు. ఈ అల్పాహారంలో వివిధ రకాల ఆహార పదార్థాలను అందిస్తామని, తేనీరు కూడా ఇస్తామని సీఎం కార్యాలయం తెలిపింది. అన్నం, రొట్టెలు, కూరగాయలతో పాటు రుచికరమైన భోజనాన్ని మధ్యాహ్నం పూటే కాకుండా రాత్రి కూడా అందిస్తామని యూపీ సీఎం కార్యాలయం వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతగా 200 సెంటర్లు ఏర్పాటు కానుండగా.. ఈ పథకానికి  సంబంధించిన ముసాయిదా ప్రస్తుతం తయారవుతుందని సీఎం కార్యాలయం తెలిపింది. ఈ కేంద్రాలు అన్నపూర్ణ భోజనాలయాస్ పేరిట నడుస్తాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments