Webdunia - Bharat's app for daily news and videos

Install App

జంతు వధశాలల మూసివేతకు సీఎం యోగి ఆదేశం.. మహ్మద్ కైఫ్ అభినందనలు

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. యూపీలో గోవుల అక్రమ రవాణాపై ఆయన పూర్తిగా నిషేధం విధించారు. అంతేకాకుండా, రాష్ట్రంలో ఉన్న జంతు వధశాలలను మూసివేతకు ప్రణాళికలు రచ

Webdunia
బుధవారం, 22 మార్చి 2017 (17:04 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. యూపీలో గోవుల అక్రమ రవాణాపై ఆయన పూర్తిగా నిషేధం విధించారు. అంతేకాకుండా, రాష్ట్రంలో ఉన్న జంతు వధశాలలను మూసివేతకు ప్రణాళికలు రచించాలని ఆయన అధికారులను కోరారు. గోవుల అక్రమ రవాణాపై పూర్తి నిషేధం విధించారు. తాను జారీ చేస్తోన్న‌ ఆదేశాలను తప్పకుండా పాటించాల్సిందేనని ఆయ‌న‌ తేల్చిచెప్పారు. 
 
మరోవైపు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ అభినందనలు తెలిపారు. భారతీయ జనతా పార్టీలో హిందూత్వ నేతగా విశేష గుర్తింపు పొందిన ఆయనకు మంచి జరగాలని ఆకాంక్షించారు. 
 
అలహాబాద్‌కి చెందిన మహ్మద్ కైఫ్ ట్విటర్లో స్పందిస్తూ.. "ప్రతి ఒక్కరికీ ఒక్కో అభిప్రాయం ఉంటుంది. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాలపై అప్పటికప్పుడే అనుమానాలు వ్యక్తం చేసేకంటే.. వారికి  శుభాకాంక్షలు చెప్పడం మంచిది. వారి హయాంలో భారతదేశం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నా’’ అని పేర్కొన్నారు. 
 
అంతేకాకుండా, "యోగి ఆదిత్యనాథ్ గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఆయన పాలనలో యూపీ అభివృద్ధి సాధించాలని, ప్రజలకు ఆయన గొప్ప భవిష్యత్తును ఇస్తారని ఆకాంక్షిస్తున్నా..." అని తెలిపాడు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments