Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరప్రదేశ్‌లో రాత్రికి రాత్రే 140 మంది అధికారుల బదిలీ.. యోగి ఆదేశాలు

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాత్రికి రాత్రే 140 మంది సివిల్ సర్వీస్ అధికారులపై బదిలీ వేటు వేశారు. వీరిలో 84 మంది ఐఏఎస్‌లు ఉండగా, 54 మంది ఐపీఎస్‌లు ఉన్నారు.

Webdunia
గురువారం, 27 ఏప్రియల్ 2017 (13:28 IST)
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాత్రికి రాత్రే 140 మంది సివిల్ సర్వీస్ అధికారులపై బదిలీ వేటు వేశారు. వీరిలో 84 మంది ఐఏఎస్‌లు ఉండగా, 54 మంది ఐపీఎస్‌లు ఉన్నారు. 
 
దేశంలోని అతిపెద్ద రాష్ట్రానికి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆయన వరుసగా సంచలన నిర్ణయాలు తీసుకుంటూ పాలనా వ్యవస్థపై పట్టు సాధిస్తున్న విషయం తెల్సిందే. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 140 మంది సివిల్‌ సర్వీసెస్‌ అధికారులను బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. యోగి అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఇంత ఎక్కువ మందిని ఒకేసారి బదిలీ చేయడం ప్రస్తుతం ఆసక్తిగా మారింది.
 
వీరిలో జిల్లా కలెక్టర్లు, పోలీస్‌ ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. ఇటీవల షహరాన్‌పూర్‌ జిల్లాలో ఘర్షణలు జరిగిన వారం రోజుల్లోనే బదిలీల నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments