Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగాల్‌లో ఘోరం : చెరువులోకి దూసుకెళ్లిన బస్సు - కార్మికుల మృతి

Webdunia
గురువారం, 23 సెప్టెంబరు 2021 (11:14 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఓ బస్సు చెరువులోకి దూసుకెళ్లింది. ఈ రాష్ట్రంలోని ఉత్తర దినాజ్‌పుర్​లో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు వలస కూలీలు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు ప్రయాణికులు గాయపడ్డారు. అయితే, ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 
 
కాగా, పలువురు వలస కూలీలు, ప్రయాణికులతో ఝార్ఖండ్​ నుంచి లక్నో వెళ్తున్న బస్సు రాయిగంజ్​లోని 34వ జాతీయ రహదారిపై బుధవారం రాత్రి 10.45 నిమిషాల ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. ఓ వాహనాన్ని(ట్రక్కుగా అనుమానం) బస్సు ఢీకొట్టిన అనంతరం అదుపు తప్పి.. చెరువులోకి దూసుకెళ్లినట్లు అధికారులు వెల్లడించారు. 
 
తొలుత స్థానికులు సహాయక చర్యలు ప్రారంభించి.. అధికారులకు సమాచారం అందించారు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సహాయక చర్యలు ముమ్మరం చేశారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయోత్సవం జరుపుకుంటున్న నాని- వాల్ పోస్టర్ బేనర్లో కొత్తవారితో సినిమా

ప్రభాస్ తో బిగ్గర్ రోల్ వుండే సినిమా చేయాలని ఉంది : ఫరియా అబ్దుల్లా

వరద బాధితులకు అండగా నిలుస్తాం: చిత్ర పరిశ్రమ

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

మిస్టర్ సెలెబ్రిటీ చిత్రంలో వినాయకచవితి పాటలో అలరించిన వరలక్ష్మీ శరత్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

బెల్లం టీతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

చింతపండు పేస్ట్‌తో ఫేస్‌ప్యాక్‌ వేసుకుంటే ఏంటి లాభం?

శరదృతువు వచ్చింది .. ఇనార్బిట్ మాల్ సైబరాబాద్‌లో ఆనందం పంచుతుంది

ప్యాకేజ్డ్ జ్యూస్‌లు వద్దండోయ్.. తాజా పండ్ల రసాలే ముద్దు

తర్వాతి కథనం
Show comments