Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో 24 గంటల్లో ఏడుగురిపై గ్యాంగ్ రేప్.. యోగి సర్కారు ఏం చేస్తోందని.. ?

ఉత్తరప్రదేశ్‌లో సీఎం యోగి ఆదిత్యనాథ్ పాలనకు కళంకం తెచ్చేలా సామూహిక అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లోనే ఏడుగురిపై సామూహిక అత్యాచారాలు జరగడం తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో విపక్షాలు

Webdunia
శుక్రవారం, 26 మే 2017 (11:10 IST)
ఉత్తరప్రదేశ్‌లో సీఎం యోగి ఆదిత్యనాథ్ పాలనకు కళంకం తెచ్చేలా సామూహిక అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లోనే ఏడుగురిపై సామూహిక అత్యాచారాలు జరగడం తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో విపక్షాలు యోగి పాలనపై ఫైర్ అవుతున్నాయి. యూపీ సీఎంగా యోగి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సామూహిక అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. యోగి ప్రవేశపెట్టిన యాంటీ రోమియో స్క్వాడ్, షీ టీమ్‌లు ఏం చేస్తున్నాయని మహిళా సంఘాలు, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. 
 
యూపీలోని గౌతమ్ బుధ్ నగర్ జిల్లా సోవాటా దగ్గర అనారోగ్యంతో బాధపడుతున్న బంధువును చూసేందుకు వెళ్తున్న కుటుంబంపై దాడి చేసి.. కారులోని నలుగురు మహిళలపై దుండగులు పాశవికంగా అత్యారానికి పాల్పడ్డారు. వారి నుంచి నగదు, నగలు దోచుకున్నారు. మరో ఘటనలో ముజఫర్ నగర్‌లో ఇద్దరు మైనర్ బాలికలపై సామూహిక అత్యాచారం జరిగింది. మరో ఘటనలో భర్తను చెట్టుకు కట్టేసి, భార్యపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. మహిళలపై జరుగుతున్న అరాచకాలను యోగి సర్కారు అడ్డుకోలేకపోతోందని, యూపీలో రాక్షస పాలన సాగుతోందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం