Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇది వివక్ష.. చట్ట విరుద్ధం - ఎస్బీఐకు జాతీయ మహిళా కమిషన్ నోటీసు

Webdunia
శనివారం, 29 జనవరి 2022 (22:04 IST)
మూడు నెలల గర్భంతో ఉన్న మహిళను ఉద్యోగంలో చేరకుండా ఆపినందుకు భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్.బి.ఐ) అధికారుల పట్ల జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతటితో ఊరుకోని మహిళా కమిషన్ ఎస్బీఐకు నోటీసు జారీచేసింది. ఎస్.బి.ఐ అధికారులు ఈ మహిళను తాత్కాలిక ఫిట్ అని పేర్కొందని కమిషన్ ఛైర్‌పర్సన్ స్వాతి మలివాల్ ట్వీట్ చేశారు. 
 
స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా మూడు నెలల కంటే ఎక్కువ గర్భిణీ స్త్రీలను సేవలో చేరకుండా నిరోధించడానికి మార్గదర్శకాలను జారీచేసిందని కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ ట్వీట్ చేశారు. బ్యాంకు చర్య వివక్షాపూరితమైనదని, చట్టవిరుద్ధమని ఆమె వ్యాఖ్యానించారు. ఇది చట్ట ప్రకారం అందించే ప్రసూతి ప్రయోజనాలపై ప్రభావం చూపుతుందన్నారు. 
 
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3 నెలల కంటే ఎక్కువ గర్భిణీ స్త్రీలను సేవలో చేరకుండా నిరోధించడానికి మార్గదర్శకాలను జారీ చేసింది. వారిని తాత్కాలికంగా అన్‌ఫిట్ అని పేర్కొంది. ఇది వివక్ష. చట్ట విరుద్ధం. ఈ మహిళ వ్యతిరేక పాలన ఉపరించుకోవాలని కోరుతూ ఎస్బీఐకు నోటీసులు జారీ చేయడం జరిగింది. అని చెప్పారు. కాగా, గత నెల 31వ తేదీన ఎస్బీఐ జారీచేసిన సర్క్యులర్‌లో మూడు నెలల కంటే ఎక్కువ గర్భిణీ స్త్రీలను పనిలో చేరకుండా నిలిపివేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments