Webdunia - Bharat's app for daily news and videos

Install App

శనిసింగనాపూర్‌లో ఉద్రికత్త: మహిళలకు నో ఎంట్రీ.. అయినా పూజలు 144 సెక్షన్..?1

Webdunia
మంగళవారం, 26 జనవరి 2016 (13:32 IST)
మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన శనిసింగనాపూర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మహిళలకు ఈ ఆలయంలో ప్రవేశం లేని నేపథ్యంలో.. హెలికాప్టర్లలో దిగిమరీ ఆలయంలోకి ప్రవేశిస్తామని కొన్ని మహిళా సంఘాలు ప్రకటించిన నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. తామంతా వచ్చి శనిదేవుడికి పూజలు చేస్తామని మహిళా సంఘాలు హెచ్చరించడంతో ఆలయం వద్ద పోలీసు బలగాలను మోహరించారు. 
 
మహిళలమైన తాము శనిదేవునికి పూజలు చేస్తామని.. ఎవరు అడ్డుకుంటారో చూస్తామని భూమాతా రణరాగిని బ్రిగేడ్ అధ్యక్షురాలు తృప్తి దేశాయ్ హెచ్చరికలు జారీ చేయడంతో ఆలయ అధికారులు అప్రమత్తమయ్యారు. దాదాపు 1500 మంది వరకూ మహిళలు దూసుకు రావచ్చన్న అంచనాలతో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.

దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎలాంటి భద్రత ఏర్పాటు చేసినా.. మహిళా సంఘాలు శనీశ్వరునికి పూజ చేస్తాయని దేశాయ్ హెచ్చరించారు. దీంతో 144 సెక్షన్‌ను అమలు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments