Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూజ పేరుతో మత్తుమందిచ్చి ఐదేళ్ల పాటు అత్యాచారం..

Webdunia
బుధవారం, 24 ఆగస్టు 2022 (14:25 IST)
ఆధునికత పెరిగినా మూఢనమ్మకాలు మరుగున పడట్లేదు. దొంగ బాబాలను నమ్మి మోసపోతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. తాజాగా బెంగళూరులో మత్తు మందు ఇచ్చి ఓ నకిలీ బాబా ఐదేళ్ల పాటు అత్యాచారానికి పాల్పడుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

దొంగ బాబా ఆ మహిళకు వివాహం కాకుండా అడ్డుకుంటూ.. ఐదేళ్ల పాటు బెదిరిస్తూ అత్యాచారానికి పాల్పడుతున్నాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

వివరాల్లోకి వెళితే.. బెంగళూరు మల్లేశ్వరంలో వివాహం కాకపోవడంతో పరిహారం కోసం కుటుంబ సభ్యుల సూచనలతో ఐదేళ్ల క్రితం ఆనందమూర్తి అనే బాబాను కలిశానని చెప్పింది బాధితురాలు.

పూజ చేస్తున్న సమయంలో ఇచ్చిన పానీయంతో స్పృహ తప్పిన తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని.. ఆ సమయంలో అతని భార్య లత తన ఫోనులో రికార్డ్ చేసిందని చెప్పింది.

ఈ వీడియోను అడ్డం పెట్టుతుని ఐదేళ్ల పాటు తనపై దొంగ బాబా అత్యాచారానికి పాల్పడుతూ వస్తున్నాడని.. మూడేళ్ల పాటు పెళ్లిని చెడగొడుతున్నాడని.. పోలీసులకు ఫిర్యాదు చేసింది.

బెదిరింపులకు గురిచేయడంతో ఇప్పటికే లక్ష రూపాయలు ఇచ్చామని.. పోలీసులకు చెబితే వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరిస్తున్నట్లు బాధితురాలు తెలిపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments