Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలి సలహాను పాటించిన ప్రియుడు.. భార్యను అలా చేశాడు..?

Webdunia
బుధవారం, 14 నవంబరు 2018 (12:57 IST)
స్మార్ట్ ఫోన్ల కాలం జరుగుతోంది. వీటి ప్రభావంతో మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. సోషల్ మీడియా ద్వారా చోటుచేసుకునే నేరాల సంఖ్య పెరిగిపోతున్నాయి. అక్రమ సంబంధాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా వివాహితుడైన ఓ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న యువతి అతడిని రహస్యంగా పెళ్లి చేసుకుంది. అంతేగాకుండా.. అదే వ్యక్తి చేతనే అతడి భార్యను హతమార్చింది. ఈ ఘటన హర్యానా, గురుగ్రామ్‌లో చోటుచేసుకుంది.  
 
వివరాల్లోకి వెళితే.. గురుగ్రామ్‌లోని వ్యాలీ వ్యూ ఎస్టేట్‌ అపార్ట్‌మెంట్‌లో విక్రమ్ సింగ్ చౌహాన్, దీపిక దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో అదే ప్రాంతంలో ఉంటున్న షెఫాలీ భాసిన్ తివారీ అనే మహిళతో విక్రమ్‌కు పరిచయం ఏర్పడింది. అది కాస్తా అక్రమ సంబంధానికి దారితీసింది. దీంతో వీరిద్దరూ ఆరు నెలల క్రితం రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఈ అక్రమ సంబంధం గురించి తెలుసుకున్న దీపిక భర్తను నిలదీసింది. ఈ సందర్భంగా భార్యాభర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. 
 
దీంతో విక్రమ్ వెంటనే షెఫాలీకి మెసేజ్ పెట్టాడు. వెంటనే స్పందించిన ఆమె.. దీపికను వాళ్లు నివాసముంటున్న ఎనిమిదో అంతస్తు నుంచి తోసేయాలని సూచించింది. ఆ సలహా నచ్చడంతో భార్యను అపార్ట్‌మెంట్ ఎనిమిదో అంతస్తు నుంచి విక్రమ్ తోసేశాడు. ఈ ఘటనలో విక్రమ్ భార్య తీవ్ర గాయాలతో మృతి చెందింది. అంతేగాకుండా.. ప్రమాదవశాత్తూ తన భార్య బిల్డింగ్ నుంచి పడిపోయిందని చెప్పాడు. 
 
అయితే విక్రమ్ ప్రవర్తనను అనుమానించిన పోలీసులు అతని కాల్ డేటా, మెసేజ్‌ను పరిశీలించగా, షెఫాలీతో కలసి దీపిక హత్యకు కుట్ర పన్నినట్లు తేలింది. దీంతో ఇద్దరు నిందితులపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments