Webdunia - Bharat's app for daily news and videos

Install App

500 కేజీల ఈజిప్టు మహిళకు ముంబైలో చికిత్స.. సుష్మా స్వరాజ్ ఉదారత వల్లే?

80 కేజీలు కాదు.. 100 కేజీలు కాదు. ఏకంగా అరటన్ను బరువుతో కూడిన మహిళ గురించే ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. భారీ బరువుతో ఎక్కడికీ కదల్లేక మంచానికే పరిమితమైన ఓ ఈజిప్టు మహిళకు భారత్‌ లో చ

Webdunia
బుధవారం, 7 డిశెంబరు 2016 (10:54 IST)
80 కేజీలు కాదు.. 100 కేజీలు కాదు. ఏకంగా అరటన్ను బరువుతో కూడిన మహిళ గురించే ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. భారీ బరువుతో ఎక్కడికీ కదల్లేక మంచానికే పరిమితమైన ఓ ఈజిప్టు మహిళకు భారత్‌ లో చికిత్స పొందేందుకు అనుమతి లభించింది. ఈజిప్టులోని భారత రాయబార కార్యాలయం ఆమెకు వీసా మంజూరు చేసింది. 
 
భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ ఉదారత వల్లే ఆమెకు ఈ వీసా దక్కింది. ఎమాన్‌ అహ్మద్‌(36) ఈజిప్టులోని అలెగ్జాండ్రియా ప్రాంతానికి చెందిన మహిళకు భారత్‌లో చికిత్స చేయనుంది. సదరు మహిళ 500 కేజీల బరువుతుంది. స్థూలకాయం కారణంగా పాఠశాలకు వెళ్లే సమయంలోనే బరువు పెరగడం ప్రారంభమైంది. దీంతో చదువు మధ్యలోనే ఆపేసింది. 
 
అయితే, ఆమెకు ముంబయిలోని వైద్యులు చికిత్స చేసేందుకు ముందుకొచ్చారు. ఆమెకు వీసా ఇచ్చి ముంబయిలో చికిత్స పొందేందుకు అవకాశం ఇ‍వ్వాలని బేరియాట్రిక్‌ సర్జన్‌ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ కు విజ్ఞప్తి చేశారు. ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్నప్పటికీ సుష్మా చేయూత నివ్వడంపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.  ప్రస్తుతం సుష్మా స్వరాజ్‌ మూత్రపిండాల సమస్యతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. 
 
దీనికి స్పందించిన సుష్మా 'ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. ఆమెకు మేం తప్పకుండా సహాయం చేస్తాం' అంటూ ట్వీట్ చేశారు. ఆ మాట ప్రకారమే మంగళవారం భారత రాయబార కార్యాలయం ఎమాన్‌ కు వీసా మంజూరు చేసింది. దీంతో త్వరలోనే ఆమె భారత్‌‌కు వచ్చి ముంబయిలో చికిత్స పొందనుంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments