Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త వేరు కాపురం పెట్టలేదని ఇద్దరు పిల్లలతో భార్య ఆత్మహత్య

Webdunia
గురువారం, 25 ఫిబ్రవరి 2016 (11:09 IST)
కుటుంబంలో ఏర్పడిన గొడవల వల్ల ఇద్దరు పిల్లలతో సహా ఓ తల్లి ఆత్మహత్య చేసుకున్న విషాదఘటన బుధవారం రంగారెడ్డి జిల్లా హయట్‌నగర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోహెడ గ్రామానికి చెందిన పర్వతాలు అనే వ్యక్తికి భార్య లావణ్య (27), వర్షిత్ ‌(7), జోషిక (5) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరితో పాటు.. మిగిలిన కుటుంబ సభ్యులు కూడా కలిసి ఉమ్మడి ఫ్యామిలీగా నివశిస్తున్నారు. 
 
అయితే, ఉమ్మడి కుటుంబంలో ఉండటం ఇష్టపడిని లావణ్య.. తన భర్తను వేరు కాపురం పెడదామని కోరింది. దీనికి పర్వాతాలు ససేమిరా అన్నాడు. దీంతో వీరిద్దరి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో.. మనస్సు విరక్తి చెందిన లావణ్య... బుధవారం సాయంత్రం తన ఇద్దరి పిల్లలు వర్షిత్‌, జోషికలు బడి నుంచి ఇంటికి రాగానే తనతో సహా పిల్లలపైనా కిరోసిన్‌పోసి నిప్పటించుకుంది. 
 
ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న చుట్టుపక్కలవారు పోలీసులకి సమాచారం అందిచారు. సమాచారం అందుకున్న హయత్‌నగర్‌ సీఐ వెంకటేశ్వర్లు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నట్లు తెలిపారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments