Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిడ్డలతో కలిసి రైలులో నుంచి దూకిన మహిళ... చిన్నగాయం కూడా...

అనేకమంది కుటుంబ కలహాల కారణంగా బలవన్మరణాలకు పాల్పడుతుంటారు. ఇలా పాల్పడేవారు కొందరు ఆత్మహత్యలు చేసుకుంటే.. మరికొందరు రైలు పట్టాలపై పడుకోవడం, ఇంకొందరు రైలు నుంచి దూకడం, మరికొందరు విషం, పురుగుల మందు తీసుక

Webdunia
సోమవారం, 25 జూన్ 2018 (09:41 IST)
అనేకమంది కుటుంబ కలహాల కారణంగా బలవన్మరణాలకు పాల్పడుతుంటారు. ఇలా పాల్పడేవారు కొందరు ఆత్మహత్యలు చేసుకుంటే.. మరికొందరు రైలు పట్టాలపై పడుకోవడం, ఇంకొందరు రైలు నుంచి దూకడం, మరికొందరు విషం, పురుగుల మందు తీసుకుని చనిపోయేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే, ఈ భూమిపై నూకలు ఉంటే మాత్రం ఎన్ని ప్రయత్నాలు చేసినా.. వారికి చిన్నపాటి గాయం కూడా కాదు. ఇలాంటి ఘటనే ఒకటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.
 
మధ్యప్రదేశ్, భూర్హన్‌పూర్‌ జిల్లాకు చెందిన తబాస్సుమ్ అనే మహిళ కుటుంబ కలహాల కారణంగా తన బిడ్డతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. దీంతో నేపానగర్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. కొద్దిసేపు స్టేషన్‌లో ఉండి... సరిగ్గా పుష్పక్ ఎక్స్‌ప్రెస్ రైల్వే స్టేషన్‌ను సమీపిస్తున్న వేళ, ఒక్కసారిగా పట్టాలపైకి దూకింది. చుట్టూ చూస్తున్న జనాలు అరుస్తుండగానే రైలు వారిపై నుంచి వెళ్లిపోయింది. అయితే, వారిద్దరీ చిన్నపాటి గాయం కూడా కాలేదు. 
 
తల్లీకూతుళ్లు ట్రాక్‌కు మధ్యగా వీరు పడటంతో, రైలు వారి మీదుగా వెళ్లిపోయింది. ఆమె బిడ్డను తన చేతులతోనే పట్టుకుని, షాక్‌కు గురికాగా, ఆర్పీఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భర్తతో విడాకులు తీసుకున్న తాను, ఎటు వెళ్లాలో తెలియని స్థితిలో చనిపోవాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments