Webdunia - Bharat's app for daily news and videos

Install App

కట్నం కోసం బాలింతను కొట్టి చంపేశారు.. రెండు నెలల క్రితమే పాప పుట్టింది..

Webdunia
శనివారం, 9 జనవరి 2021 (16:36 IST)
వరకట్న వేధింపులకు మరో యువతి బలైంది. పుట్టింటి నుంచి అదనపు కట్నం తేవాలంటూ బాలింతను భర్త, అత్తమామలు కొట్టి చంపేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం షామ్లీ జిల్లా తానాభవన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మోర్ మజ్రా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. భర్త, అత్తమామలు చిత్రహింసలు పెడుతున్నారంటూ తమ కూతురు ఫోన్ చేసిందని, తాము తమ బిడ్డను రక్షించుకుందామని వచ్చేసరికే శవమై పడివుందని మృతురాలి తల్లిదండ్రులు విలపించారు.
 
ఏడాదిన్నర క్రితం అన్ని రకాల కట్న కానుకలతో తమ బిడ్డను మెట్టింటికి సాగనంపామని, పెండ్లి జరిగిన నెల నుంచే అత్తింటి వారి వేధింపులు మొదలయ్యాయని అన్ను తల్లిదండ్రులు ఆరోపించారు. అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని తమ కూతురు చెప్పినప్పుడల్లా సర్దిచెబుతూ వచ్చామని, ఇంత ఘోరం జరుగుతుందని ఊహించలేదని చెప్పారు. రెండు నెలల క్రితమే తమ బిడ్డ ఒక పాపకు జన్మనిచ్చిందని, పచ్చిబాలింత అని కూడా చూడకుండా అత్తింటివారు వేధించి చంపారంటూ విలపించారు.
 
కాగా, మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతురాలి భర్త, అత్తమామలను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments