Webdunia - Bharat's app for daily news and videos

Install App

నలుగురు పిల్లలకు ఒకేసారి జన్మనిచ్చిన జైపూర్ మహిళ

సెల్వి
మంగళవారం, 6 ఆగస్టు 2024 (10:31 IST)
జైపూర్‌లో ఓ మహిళ ఆస్పత్రిలో నలుగురు పిల్లలకు ఒకేసారి జన్మనిచ్చింది. వారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నందున వారిని వైద్య పరిశీలనలో ఉంచినట్లు అధికారులు తెలిపారు. పుట్టిన నలుగురిలో ఇద్దరు మగపిల్లలు కాగా మరో ఇద్దరు ఆడపిల్లలు. 
 
ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆశా వర్మ మాట్లాడుతూ: "దౌసాలో నివసిస్తున్న సంతోష్ ప్రజాపతి (21) ఆగస్టు 4న ఆసుపత్రిలోని యూనిట్ -6లో చేరారు. సోమవారం ఉదయం, 8 గంటల ప్రాంతంలో, మహిళ సాధారణ ప్రసవం ద్వారా నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. 
 
పిల్లల బరువు తక్కువగా ఉండడంతో వారిని ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. నలుగురు పిల్లల్లో ఇద్దరు ఒక్కొక్కరు ఒక్కో కేజీ, ఒకరు 700 గ్రాములు, మరొకరు 930 గ్రాములు ఉన్నారని డాక్టర్ తెలిపారు. 
 
ప్రస్తుతం ఆ స్త్రీ ఆరోగ్యంగా ఉంది. అయితే, పిల్లలు శ్వాస తీసుకోవడంలో కొంత ఇబ్బంది పడుతున్నారు. డెలివరీ ముందుగానే కావడంతో, పిల్లలు తక్కువ బరువు కలిగి ఉన్నారు. పిల్లలు త్వరగా సాధారణ స్థితికి వచ్చేలా వారికి అత్యుత్తమ వైద్య చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ హీరో కళ్లలో గమ్మత్తైన ఆకర్షణ ఉంది : షాలిని పాండే

సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్‌ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments