Webdunia - Bharat's app for daily news and videos

Install App

నలుగురు పిల్లలకు ఒకేసారి జన్మనిచ్చిన జైపూర్ మహిళ

సెల్వి
మంగళవారం, 6 ఆగస్టు 2024 (10:31 IST)
జైపూర్‌లో ఓ మహిళ ఆస్పత్రిలో నలుగురు పిల్లలకు ఒకేసారి జన్మనిచ్చింది. వారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నందున వారిని వైద్య పరిశీలనలో ఉంచినట్లు అధికారులు తెలిపారు. పుట్టిన నలుగురిలో ఇద్దరు మగపిల్లలు కాగా మరో ఇద్దరు ఆడపిల్లలు. 
 
ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆశా వర్మ మాట్లాడుతూ: "దౌసాలో నివసిస్తున్న సంతోష్ ప్రజాపతి (21) ఆగస్టు 4న ఆసుపత్రిలోని యూనిట్ -6లో చేరారు. సోమవారం ఉదయం, 8 గంటల ప్రాంతంలో, మహిళ సాధారణ ప్రసవం ద్వారా నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. 
 
పిల్లల బరువు తక్కువగా ఉండడంతో వారిని ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. నలుగురు పిల్లల్లో ఇద్దరు ఒక్కొక్కరు ఒక్కో కేజీ, ఒకరు 700 గ్రాములు, మరొకరు 930 గ్రాములు ఉన్నారని డాక్టర్ తెలిపారు. 
 
ప్రస్తుతం ఆ స్త్రీ ఆరోగ్యంగా ఉంది. అయితే, పిల్లలు శ్వాస తీసుకోవడంలో కొంత ఇబ్బంది పడుతున్నారు. డెలివరీ ముందుగానే కావడంతో, పిల్లలు తక్కువ బరువు కలిగి ఉన్నారు. పిల్లలు త్వరగా సాధారణ స్థితికి వచ్చేలా వారికి అత్యుత్తమ వైద్య చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments