Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యాభర్తల గొడవ.. భార్యను హత్య చేసి.. శవాన్ని ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి పరార్

Webdunia
మంగళవారం, 25 అక్టోబరు 2022 (19:13 IST)
భార్యాభర్తల గొడవ.. హత్యకు దారితీసింది. భార్యాభర్తల మధ్య ఏర్పడిన గొడవ హత్యకు కారణమైంది. భార్య గొంతు కోసి భర్త హత్య చేసి.. శవాన్ని ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి పరారైన ఘటన కేరళ, ఎర్నాకులంలో చోటుచేసుకుంది. కుళ్లిన స్థితిలో ఉన్న మహిళ మృతదేహం నుంచి దుర్వాసన రావడం వల్ల పోలీసులకు ఇంటి యజమాని సమాచారం అందించాడు.
 
వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రకు చెందిన దంపతులు ఎర్నాకులంలోని గిరినగర్‌లో ఏడాదిగా అద్దెకు ఇంట్లో వుంటున్నారు. వీరిద్దరి మధ్య జరిగే గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. క్షణికావేశానికి గురైన భర్త భార్య గొంతు కోసి చంపేశాడు. అంతటితో వదలక మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి పడేశాడు. 
 
అయితే ఆ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో ఇంటి ఓనర్ అక్టోబర్ 14న సాయంత్రం పోలీసులకు సమాచారం అందించాడు. ఈ ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. భార్యను హత్య చేసి నిందితుడు పారిపోయి వుండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments