Webdunia - Bharat's app for daily news and videos

Install App

‘టాయిలెట్ కడితేనే కాపురానికొస్తా’! బీహార్‌లో మరో మహిళ సంచలనం

Webdunia
ఆదివారం, 23 నవంబరు 2014 (14:36 IST)
గతంలో మరుగుదొడ్డి నిర్మాణం కోసం మంగళసూత్రాన్ని అమ్మివేసిన ఓ మహిళ వార్తల్లోకెక్కింది. తాజాగా బీహార్‌లో టాయిలెట్ కట్టిస్తేనే కాపురానికొస్తానంటూ మరి మహిళ సంచలనం సృష్టించింది. పాట్నా జిల్లాలోని బిక్రమ్ గ్రామానికి చెందిన కార్పెంటర్ రాకేశ్ శర్మతో బాబ్లీ దేవి(20)కి గతేడాది వివాహం జరిగింది. ఆ సమయంలో ఇంటి వద్ద టాయిలెట్ కట్టించాలంటూ ఆమె కోరగా అందుకు అంగీకరించిన రాకేశ్ తర్వాత పట్టించుకోలేదు. చివరికి మరుగుదొడ్డి నిర్మాణానికి తిరస్కరించాడు.
 
ఈ విషయమై వారి మధ్య వాగ్వాదం జరగడంతో ఆమెను రాకేశ్ కొట్టాడు. దీంతో విసిగిపోయిన బాబ్లీ దేవి ఇక లాభం లేదనుకుని పుట్టింటికి పయణమైంది.  పనిలోపనిగా తన భర్త మరుగుదొడ్డిని కట్టించేలా చూడాలని కోరుతూ పాట్నా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసింది. 
 
మరుగుదొడ్డి కట్టేదాకా ఆ ఇంటికి రానంటూ తెగేసి చెప్పింది. బహిర్భూమికి వెళ్లడం మహిళకు సిగ్గుచేటు అని, ఇది ఆరోగ్యం, గౌరవం, హుందాతనానికి సంబంధించిన విషయం అని ఆమె అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments