Webdunia - Bharat's app for daily news and videos

Install App

బర్త్‌డే పార్టీకి పిలిచి లేడీ కానిస్టేబుల్‌పై సామూహిక అత్యాచారం

Webdunia
శనివారం, 25 సెప్టెంబరు 2021 (18:43 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నీముచ్ జిల్లాలో దారుణం జరిగింది. కొందరు కామాంధులు ఏకంగా మహిళా కానిస్టేబుల్‌పైనే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇది ఇపుడు దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  
 
నీముచ్ జిల్లాలో ఈ నెల ప్రారంభంలో ముగ్గురు వ్యక్తులు తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు బాధిత మహిళా కానిస్టేబుల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్‌గా పరిచయమైన ప్రధాన నిందితుడు ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి తనతో వాట్సాప్‌లో చాట్‌ చేస్తున్నట్లు చెప్పింది. 
 
అతని సోదరుడి పుట్టిన రోజు పార్టీకి తనని ఆహ్వానించాడని, ప్రధాన నిందితుడితోపాటు అతడి సోదరుడు, మరో వ్యక్తి కలిసి తనపై సామూహిక అత్యాచారం చేసినట్లు ఆమె ఆరోపించింది. 
 
దీనిని వీడియో తీశారని, ప్రధాన నిందితుడి తల్లి, మరో వ్యక్తి తనను డబ్బుల కోసం బ్లాక్‌మెయిల్‌ చేశారని, చంపుతామని కూడా బెదిరించారని ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి పిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేయగా, పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం