Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీమా సొమ్ము కోసం భర్తను చంపేసిన భార్య!

Webdunia
గురువారం, 3 డిశెంబరు 2020 (11:29 IST)
బీమా సొమ్ముకు ఆశపడిన భార్య... ఏకంగా కట్టుకున్న భర్తనే కడతేర్చింది. ఈ దారుణం మహారాష్ట్రలోని లాతూరు జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, లాతూర్ జిల్లా బాభల్ గావ్ గ్రామానికి సమీపంలో 2012వ సంవత్సరంలో ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అన్నారావు బాన్సోడ్ అనే వ్యక్తి మరణించాడు. దీంతో స్థానిక పోలీసులు రోడ్డు ప్రమాద మృతి కేసుగా నమోదు చేసి, కేసును మూసివేశారు. 
 
అయితే, ఘటనా స్థలాన్ని సందర్శించిన బీమా సంస్థ ప్రమాదంపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భర్తపై ఉన్న కోటిరూపాయల బీమా డబ్బు పొందడం కోసం అతని భార్య జ్యోతి బాన్సోడ్, బీమా ఏజెంటు రమేష్ వివేకి, అతని స్నేహితుడు గోవింద్ సుబోధిలు కలిసి కుట్రపన్ని హతమార్చి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
బీమా డబ్బు కోసమే అన్నారావును చంపారని తేలడంతో జిల్లా ఎస్పీ నిఖిల్ పింగాలే ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి జ్యోతిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న బీమా ఏజెంట్, అతని స్నేహితుడు కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments