Webdunia - Bharat's app for daily news and videos

Install App

నయీమ్ బాధితులకు గుడ్ న్యూస్.. భూములను తిరిగి ఇచ్చేస్తున్నాం.. సిట్ అధికారులు

గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. ఇంకా నయీం కేసును విచారిస్తున్న సిట్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. నయీం బెదిరింపులకు లొంగిపోయి భూములిచ్చేసిన బాధితులకు న్యాయం చేయ

Webdunia
ఆదివారం, 20 నవంబరు 2016 (10:36 IST)
గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. ఇంకా నయీం కేసును విచారిస్తున్న సిట్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. నయీం బెదిరింపులకు లొంగిపోయి భూములిచ్చేసిన బాధితులకు న్యాయం చేయాలని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా నయీమ్ అక్రమంగా ఆక్రమించుకున్న భూముల డాక్యుమెంట్లను బాధితులకు తిరిగిచ్చేయాలని సిట్, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. 
 
ఈ భూముల విలువ దాదాపు వెయ్యి కోట్లు ఉంటుందని అంచనా. ప్రభుత్వం ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలుపగానే ఈ భూముల పత్రాలను తిరిగిచ్చే అవకాశముంది. ఇదిలా ఉంటే.. గ్యాంగ్‌స్టర్ నయీమ్ తన బావను మూడేళ్ల కిందట రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ప్రాంతంలోనే హత్య చేసినట్లు సిట్ విచారణలో తేలింది.

అతని సోదరి భర్త విజయ్‌కుమార్ అలియాస్ నదీమ్‌ను అతి కిరాతంగా మట్టుపెట్టి శంషాబాద్ మండలం పెద్దతూప్ర సమీపంలో పెట్రోలు పోసి తగులబెట్టాడు. ఈ కేసు ఇప్పటి వరకు మిస్టరీగానే ఉండగా.. నయీమ్ ఎన్ కౌంటర్ అనంతరం అతని అనుచరులను సిట్ అధికారుల విచారణ చేస్తుండడంతో పెద్దతూప్రలో జరిగిన హత్య విషయం వెలుగుచూసింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments