Webdunia - Bharat's app for daily news and videos

Install App

మందుబాబులను 'ఏప్రిల్ ఫూల్స్' చేసిన వైన్ షాపు

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2020 (20:38 IST)
కరోనా లాక్డౌన్ నేపథ్యంలో అన్ని మద్యం దుకాణాలు మూసేశారు. అప్పటి నుంచి మందు బాబులు 'దాహం'తో పిచ్చెక్కిపోతున్నారు.

అయితే కర్ణాటకలో ఓ వైన్ షాపు ఏప్రిల్ 1న మద్యం అమ్మనున్నట్లు తెలిసింది. అంతే పెద్ద సంఖ్యలో దుకాణం ఎదుట క్యూ కట్టారు.

తీరా నిజం తెలిశాక వారు పడిన బాధ అంతా ఇంతా కాదు. గడగ్ పట్టణంలో బుధవారం మద్యం దుకాణాలు తెరుచుకుంటాయనే వార్తలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి.

అంతే చుట్టుపక్కల ప్రాంతాల్లోని మందు బాబులంతా ములగంద్ రోడ్డు సమీపంలోని వైన్ షాపు ఎదుట క్యూ కట్టారు. అది కూడా ఎలాంటి తోపులాట లేకుండా.. క్రమశిక్షణ పాటిస్తూ నిలబడ్డారు.

వీరిలో మహిళలు, యువత, వృద్ధులు కూడా ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. మద్యం దుకాణం నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. ఇదంతా అబద్దం అని తెలిశాక.. పాపం మందు బాబులంతా నిరాశతో వెనుతిరిగారు.

మద్యం లేక మృతి ఇటీవలే లాక్డౌన్తో మందు దొరక్కపోవడం వల్ల.. చాలా మంది మద్యం ప్రియులు ఆత్మహత్య చేసుకున్నారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఈ ఘటనలు ఎక్కువగా జరిగాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments