Webdunia - Bharat's app for daily news and videos

Install App

మందుబాబులను 'ఏప్రిల్ ఫూల్స్' చేసిన వైన్ షాపు

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2020 (20:38 IST)
కరోనా లాక్డౌన్ నేపథ్యంలో అన్ని మద్యం దుకాణాలు మూసేశారు. అప్పటి నుంచి మందు బాబులు 'దాహం'తో పిచ్చెక్కిపోతున్నారు.

అయితే కర్ణాటకలో ఓ వైన్ షాపు ఏప్రిల్ 1న మద్యం అమ్మనున్నట్లు తెలిసింది. అంతే పెద్ద సంఖ్యలో దుకాణం ఎదుట క్యూ కట్టారు.

తీరా నిజం తెలిశాక వారు పడిన బాధ అంతా ఇంతా కాదు. గడగ్ పట్టణంలో బుధవారం మద్యం దుకాణాలు తెరుచుకుంటాయనే వార్తలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి.

అంతే చుట్టుపక్కల ప్రాంతాల్లోని మందు బాబులంతా ములగంద్ రోడ్డు సమీపంలోని వైన్ షాపు ఎదుట క్యూ కట్టారు. అది కూడా ఎలాంటి తోపులాట లేకుండా.. క్రమశిక్షణ పాటిస్తూ నిలబడ్డారు.

వీరిలో మహిళలు, యువత, వృద్ధులు కూడా ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. మద్యం దుకాణం నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. ఇదంతా అబద్దం అని తెలిశాక.. పాపం మందు బాబులంతా నిరాశతో వెనుతిరిగారు.

మద్యం లేక మృతి ఇటీవలే లాక్డౌన్తో మందు దొరక్కపోవడం వల్ల.. చాలా మంది మద్యం ప్రియులు ఆత్మహత్య చేసుకున్నారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఈ ఘటనలు ఎక్కువగా జరిగాయి.

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments