మహారాష్ట్ర సీఎంగా గడ్కరీ? ఇంతకీ ఆయనేమన్నారు?

Webdunia
గురువారం, 7 నవంబరు 2019 (13:29 IST)
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా నితిన్ గడ్కరీ మరోమారు బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు ఢిల్లీతో పాటు.. ముంబైలో ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ప్రచారంపై నితిన్ గడ్కరీ స్పందించారు. 
 
తాను మహారాష్ట్ర తిరిగి వచ్చే ప్రసక్తే లేదనీ, ఢిల్లీలోనే కొనసాగుతానని స్పష్టంచేశారు. 'మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుపై త్వరలోనే నిర్ణయం వెలువడుతుంది. దేవేంద్ర ఫడ్నవిస్ నాయకత్వంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడుతుంది. ఆరెస్సెస్‌కిగానీ, మోహన్ భగవత్‌కి గానీ దీంతో సంబంధం లేదన్నారు. 
 
పైగా, తమకు శివసేన మద్దతు ఉంది. వాళ్లతో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి అని చెప్పారు. సీఎం పదవిని రెండున్నరేళ్ల చొప్పున పంచుకుందామని శివసేన ప్రతిపాదించడం... అందుకు బీజేపీ ససేమిరా అనడంతో మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. 
 
మొత్తం 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో మెజారిటీ మార్కు 145గా ఉంది. బీజేపీ 105 సీట్లు గెలుచుకోగా శివసేన 56 స్థానాల్లో విజయం సాధించింది.
 
కాగా, మహారాష్ట్రలో పరిస్థితులను చక్కబెట్టేలా నితిన్ గడ్కరీకి బాధ్యతలు అప్పగించాలంటూ ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్‌కు శివసేన నేత కిశోర్ తివారీ ఇటీవల లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ నెల 8తో ప్రస్తుత అసెంబ్లీ గడువు సైతం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఆరెస్సెస్ చీఫ్‌తో సమావేశం అయ్యేందుకు గురువారం గడ్కరీ హుటాహుటిన నాగ్‌పూర్‌కు చేరుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చీరకట్టులో నభా నటేశ్ దీపావళి వేడుకలు

చిరంజీవి నివాసంలో మెగా దీపావళి వేడుకలు.. అతిథిలు వీరే

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments