Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీకి ఓటు వేయని ముస్లింలకు టిక్కెట్ ఎందుకివ్వాలి : కతియార్ సూటిప్రశ్న

భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత వినయ్ కతియార్ మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బేజీపీకి ఓటు వేయని ముస్లింలకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్ ఎందుకు ఇవ్వాలంటూ సూటిగా ప్రశ్నించారు. ముస్లింలకు టిక్కెట్

Webdunia
సోమవారం, 27 ఫిబ్రవరి 2017 (17:45 IST)
భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత వినయ్ కతియార్ మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బేజీపీకి ఓటు వేయని ముస్లింలకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్ ఎందుకు ఇవ్వాలంటూ సూటిగా ప్రశ్నించారు. ముస్లింలకు టిక్కెట్లు ఇవ్వకపోవడం పొరపాటేనంటూ కేంద్ర మంత్రి ఉమాభారతి ఆదివారం చేసిన వ్యాఖ్యలపై కతియార్ సోమవారం స్పందించారు.
 
ఇదే అంశంపై ఆయన స్పందిస్తూ.. అసలు ముస్లింలు ఎప్పుడైనా భారతీయ జనతా పార్టీకి ఓటు వేశారా? మరి అలాంటప్పుడు వారికి టిక్కెట్లు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అంటూ నిలదీశారు. యూపీ ఐదో విడత ఎన్నికల్లో ముస్లింలు ఎవరూ గెలవరని కూడా ఆయన ఢంకా బజాయించారు. 
 
హోం మంత్రి రాజ్‌నాథ్ సైతం 'ముస్లింలకు టిక్కెట్లు ఇచ్చి ఉండొచ్చు' అని అభిప్రాయం వ్యక్తం చేయగా, ఉమాభారతి కూడా ఆయన వాదనను సమర్ధించారు. అయితే గెలుపుగుర్రాలను దృష్టిలో ఉంచుకున్నప్పుడు మాత్రం ముస్లింలు, మహిళలకు టిక్కెట్లు దొరక్కపోవడం పరిపాటేనన్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments