Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిందూ దేవతలపై పోస్టులు.. ట్విట్టర్‌పై హైకోర్టు ఫైర్

Webdunia
మంగళవారం, 29 మార్చి 2022 (17:06 IST)
కాళికా దేవి సహా ఇతరు హిందూ దేవతలపై అభ్యంతరకరమైన పోస్టులను పెట్టిన "ఎథిస్ట్‌రిపబ్లిక్" ట్విట్టర్ ఖాతాను నిలిపివేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన జస్టిస్ విపిన్ సంఘీ, జస్టిస్ నవీన్ చావ్లాల ధర్మాసనం.. ట్విట్టర్ చర్యలపై అసహనం వ్యక్తం చేసింది.
 
అయితే, కోర్టు ఉత్తర్వుల్లేకుండా ఆ ఖాతాలను నిలిపివేసే అధికారం మాకు లేదని ట్విట్టర్ వివరించింది. ఈ వివరణపై హైకోర్టు తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తూ.. కేంద్రం ఐటీ మార్గదర్శకాల ఫ్రేమ్‌వర్క్‌ను తప్పనిసరిగా అనుసరించాలని సూచించింది. ట్విట్టర్, కేంద్రం సహా ఎథిస్ట్‌రిపబ్లిక్ ఖాతా నిర్వాహకులకు నోటీసులు జారీచేసింది.
 
అంతిమంగా వివాదాన్ని పెంచడమే తప్పా వేరే మతానికి సంబంధించి ఇలాంటివి జరిగితే, మీరు చాలా జాగ్రత్తగా, మరింత సున్నితంగా ఉంటారని మేము ధైర్యంగా చెప్పగలమని మండిపడింది. కోర్టు ఉత్తర్వుల్లేకుండా బ్లాక్ చేయలేమంటున్నారు సరే, ట్రంప్ విషయంలో ఏ కోర్టు ఆదేశాలిచ్చిందో తెలియజేయాలని నిలదీసింది. 
 
అభ్యంతరకరమైన కంటెంట్‌ను పోస్ట్ చేసే ఖాతాదారులను బ్లాక్ చేయడం పట్ల మీ విధానాన్ని తెలియజేయాలని ఢిల్లీ హైకోర్టు అడిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: వెండితెరపై కనిపించి రెండేళ్లైంది.. మా ఇంటి బంగారంగా వస్తానుగా అంటోన్న సమంత

AR Murugadoss- శివకార్తికేయన్, ఏఆర్ మురుగదాస్ చిత్రం మదరాసి తాజా అప్ డేట్

చిరంజీవిని మీరు నా డెమి-గాడ్.. అంటున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల

Chiranjeevi 158 - అక్టోబర్ లో చిరంజీవి 158వ చిత్రానికి దర్శకుడు బాబీ శ్రీకారం

Anjali : RB చౌదరి నిర్మాతగా విశాల్ 35 చిత్రంలో నటించనున్న అంజలి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments