కమల్ హాసన్‌కు ఎందుకంత తొందర, ఓపిక లేదా?

Webdunia
శుక్రవారం, 18 డిశెంబరు 2020 (14:56 IST)
రజినీకాంత్ తను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. ప్రకటన వచ్చిన వెంటనే అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. పెద్ద ఎత్తున సంబరాల్లో మునిగితేలారు. చాలామంది నేతలు రజినీకాంత్ పార్టీలో చేరడానికి సన్నద్థమవుతున్నారు. 
 
కానీ సహచర సినీనటుడు కమల్ హాసన్ మాత్రం రజినీకాంత్‌తో కలిసేందుకు సిద్థమన్నారు. రజినీ ఆహ్వానిస్తే ఆయనతో కలిసి పనిచేస్తానని స్పష్టం  చేశారు. రజినీ పార్టీ పెడతారని ప్రచారం జరుగుతున్న సమయంలోనే కమల్ హాసన్ మక్కల్ నీతిమయ్యం అనే పార్టీని స్థాపించేశారు.
 
గత పార్లమెంటు ఎన్నికల్లో పోటీ కూడా చేశారు. కానీ పెద్దగా స్పందన మాత్రం రాలేదు. కానీ ఇప్పుడు రజినీకాంత్ పార్టీ పెడుతుండడంతో రాజకీయంగా నిలబడాలంటే రజినీతో కలవడమే మంచిదన్న ఉద్దేశంతో ఆయనకు దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. 
 
తమిళనాడులో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ అనిశ్చితి దృష్ట్యా ప్రత్యామ్నాయంగా రజినీని జనం ఆదరించే అవకాశం ఉందని... దాంతో పాటు తాము కూడా కలిస్తే జనాల్లోకి ఈజీగా వెళ్ళగలమని భావిస్తున్నారట కమల్ హాసన్. అయితే కాస్త ఒపిక పట్టాలని.. పార్టీ విధివిధానాలు తెలియకుండా రజినీతో కలవడం అంత మంచిది కాదని కూడా కమల్ సన్నిహితులు హితబోధ చేస్తున్నారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments