Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా మహమ్మారి ఇంకా ప్రపంచాన్ని వదల్లేదు.. డబ్ల్యూహెచ్‌వో

Webdunia
సోమవారం, 25 అక్టోబరు 2021 (23:53 IST)
కరోనా మహమ్మారి ఇంకా ప్రపంచాన్ని వదల్లేదని.. ప్రపంచ దేశాలు అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ప్రపంచ ఆరోగ్య సమీక్షా కార్యక్రమంలో డబ్ల్యూహెచ్‌వో (ప్రపంచ ఆరోగ్య సంస్థ) చీఫ్ టెడ్రోస్ అధానమ్‌ ఘెబ్రియేసస్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికీ వారానికి 50 వేల కరోనా మరణాలు ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
 
ఇలాంటి పరిస్థితుల్లో కరోనా మహమ్మారి తగ్గిపోయిందని భావించడం సరికాదని అభిప్రాయపడ్డారు. ప్రపంచం కోరుకున్నప్పుడే ఈ మహమ్మారిని అంతమొందిచగలమని టెడ్రోస్ చెప్పారు. తమ జనాభాలో 40 శాతంపైగా ప్రజలకు వ్యాక్సిన్ అందించిన జీ20 దేశాలు ఇకపై కోవ్యాక్స్‌పై దృష్టి సారించాలని కోరారు. ప్రపంచంలోని పేద దేశాలకు వ్యాక్సిన్ అందించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవ్యాక్స్‌ మిషన్‌ ప్రారంభించిన సంగతి తెలిసిందే. 
 
అలాగే ఆఫ్రికా దేశాల కోసం ఆఫ్రికన్ వ్యాక్సిన్ అక్విషన్ ట్రస్ట్ (ఏవీఏటీ) అనే స్వచ్ఛంద సంస్థ కూడా వ్యాక్సిన్‌ సేకరణ కోసం కృషి చేస్తోంది. జీ20 దేశాలు ఈ రెండు పథకాల్లో యాక్టివ్‌గా పాలుపంచుకోవాలని టెడ్రోస్ విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments