Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్సాప్ ద్వారా కాన్పు చేసిన నర్సులు.. ఐసీయూలో శిశువు..

Webdunia
శుక్రవారం, 7 జూన్ 2019 (11:44 IST)
సోషల్ మీడియా ప్రభావం ప్రజలపై అంతా ఇంతా కాదు. స్మార్ట్ ఫోన్ వుంటే చాలు ప్రపంచమే తమ చేతుల్లో వుందనే భావన అందరికీ వచ్చేస్తుంది. స్మార్ట్‌ఫోన్, వాట్సాప్‌ను ఉపయోగించి.. ఎన్నెన్నో కొత్త విషయాలను నేర్చుకుంటున్నారు. తాజాగా ఓ వైద్యుడు వాట్సాప్ ద్వారా డేటాను షేర్ చేసుకుని.. నర్సుల సాయంతో ఓ మహిళకు కాన్పు చూడటం ప్రస్తుతం సంచలనానికి దారి తీసింది. 
 
ఈ విషయం వెలుగులోకి రావడంతో సదరు వైద్యుడు కాన్పు చూసిన ప్రైవేట్ ఆస్పత్రిని మహిళ బంధువులు చుట్టుముట్టారు. ఈ ఘటన తమిళనాడు, కోయంబత్తూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కోవై, రత్నపురిలోని సంబత్ వీధిలో నివసిస్తున్న రంగరాజ్.. ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇతని భార్య నిత్య (23) గర్భదాల్చింది. 
 
ఈ నేపథ్యంలో జూన్ 3వ తేదీ నిత్య చెకప్ కోసం వెళ్లింది. ఆ సమయంలో ఆమెను పరీక్షించిన నర్సులు ఆమెకు వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఈ క్రమంలో నిత్యకు పాప పుట్టింది. కానీ కాసేపటికే శిశువు ఆరోగ్యం క్షీణించింది. వెంటనే ఆ పసికందును వేరొక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ శిశువుకు ఐసీయూలో వుంచి చికిత్స చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో నిత్యకు తప్పుడు విధానంలో ఆపరేషన్ చేయడం ద్వారానే శిశువు ఆరోగ్యం మందగించిందని ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై నిత్య మాట్లాడుతూ.. తాను ఆస్పత్రిలోని లేబర్ వార్డుకు వెళ్లినప్పుడు తనకు వైద్యులు ఆపరేషన్ చేయలేదని.. షాకింగ్ నిజం చెప్పింది. 
 
డాక్టర్‌కు ఫోన్ చేసి వాట్సాప్ ద్వారా సమాచారం అందుకుని నర్సులు తనకు వైద్యం చేశారని నిత్య చెప్పుకొచ్చింది. కానీ నిత్య ఆరోపణలను వైద్యులు ఖండించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments