Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలోనే మహారాష్ట్రకు కొత్త ముఖ్యమంత్రి : సంజయ్ రౌత్

Webdunia
ఆదివారం, 2 జులై 2023 (18:33 IST)
ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ వర్గం మహారాష్ట్రలోని ఎన్డీయే ప్రభుత్వంలో చేరడంపై శివసేన (యూబీటీ) సీనియర్‌ నేత సంజయ్‌ రౌత్‌ స్పందించారు. ఈ అనూహ్య పరిణామాన్ని ఏక్‌నాథ్‌ షిండే తన సీఎం పదవి కోల్పోవడానికి నాందిగా ఆయన అభివర్ణించారు. త్వరలోనే మహారాష్ట్రకు కొత్త సీఎం వస్తారంటూ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. 
 
ఎన్సీపీ తిరుగుబాటు నేత అజిత్‌ పవార్‌ ఉప ముఖ్యమంత్రిగా, మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడం మహారాష్ట్ర రాజకీయాలను కీలక మలుపు తిప్పిన విషయం తెలిసిందే. 
 
ఈ పరిణామంపై ఎంపీ సంజయ్‌ రౌత్‌ స్పందిస్తూ.. 'అజిత్‌ పవార్‌ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయడం ఏక్‌నాథ్‌ శిందే తన పదవిని కోల్పోయే ప్రక్రియ మొదలైనట్టే.. ఆయన వర్గం ఎమ్మెల్యేలు సభలో అనర్హతకు గురవుతారు. ఆ తర్వాత ప్రభుత్వానికి ఇబ్బందులు లేకుండా అజిత్‌ పవార్‌, ఎన్సీపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వంలో చేరారు' అని రౌత్‌ అన్నారు. 
 
ఈ పరిణామాన్ని ట్రిపుల్‌ ఇంజిన్‌ సర్కార్‌గా చూడరాదని.. రెండు ఇంజిన్లలో ఒకటి విఫలం కావడంతో వ్యాఖ్యానించారు. అయితే, ఈ పరిణామం గురించి ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్‌కు తెలుసా అని విలేకర్లు ఆయన్ను ప్రశ్నించగా.. ఆయనకు మొత్తం సమాచారం ఉందంటూ రౌత్‌ బదులిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరోయిన్ శ్రీలీలతో డేటింగా? బాలీవుడ్ హీరో ఏమంటున్నారు!!

Ram Prakash : రిలేషన్, ఎమోషన్స్‌, వినోదం కలయికలో చెరసాల సిద్ధం

Sumaya Reddy: గుడిలో కన్నా హాస్పిటల్‌లో ప్రార్థనలే ఎక్కువ.. అంటూ ఆసక్తిగా డియర్ ఉమ టీజర్

పెద్ది సినిమా గేమ్ ఛేంజర్ కాబోతోంది.. రామ్ గోపాల్ వర్మ కితాబు

అది అభయారణ్యం కాదు.. సిటీకి జీవం పోసే పర్యావరణ వ్యవస్థ : ఊర్వశి రౌతేలా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

తర్వాతి కథనం
Show comments