Webdunia - Bharat's app for daily news and videos

Install App

'అమ్మ'పై వీరాభిమానం... శిలువపై వేలాడిన కరాటే మాస్టర్...!

Webdunia
మంగళవారం, 24 ఫిబ్రవరి 2015 (13:14 IST)
తమిళనాడు రాష్ట్ర మాజీ ముఖ్య మంత్రి జయలలితపై ఎనలేని అభిమానం చూపే ప్రజలు, అభిమానులు ఆమెను ముద్దుగా 'అమ్మ' అని పిలుచుకుంటారు. అలాంటి అమ్మకు ఓ వీరాభిమాని తన కాళ్లు, చేతులపై మేకులు కొట్టించుకుని శిలువపై వేలాడి, తన వీరాభిమానాన్ని చాటుకున్నాడు. 
 
తమిళనాడు మాజీ సీఎం జయలలిత కోసం ఆమె వీరాభిమాని, కరాటే మాస్టర్ షిహన్ హుస్సైని శిలువ ధరించారు. కాలికి, చేతికి మేకు ధరించి ఆమె పుట్టిన రోజు (మంగళవారం- ఫిబ్రవరి24)ను పురస్కరించుకుని పది కాలాల పాటు చల్లగా ఉండాలని, మళ్లీ సీఎం కావాలని ఆశించారు. 
 
పొడవాటి మేకులను కాలికి చేతికి కొట్టించుకుని జీసస్ తరహాలో అమ్మకోసం శిలువ ధరించి కాసేపు జయలలితను కొనియాడారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌‍లో అమ్మ త్వరలో సీఎం కావాలని ఆకాంక్షించారు. ఆరు నిమిషాల పాటు హుస్సైని అమ్మ కోసం శిలువలోనే ఉండిపోయారు. 
 
కాగా గతంలో అమ్మ కోసం కరాటే మాస్టర్ హుస్సైని రక్తంతోనే జయమ్మ చిత్రపటాన్ని గీశారు. తర్వాత తన రక్తంతో అమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేసి.. తన వీరాభిమానాన్ని చాటుకున్నారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments