Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీ రైలు ప్రమాదాన్ని తప్పించిన బాలుడు.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 24 సెప్టెంబరు 2023 (09:08 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ఓ బాలుడు భారీ రైలు ప్రమాదాన్ని నివాహించాడు. దీంతో ఆ బాలుడిని ప్రతి ఒక్కరూ ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఈ ఘటన బెంగాల్ రాష్ట్రంలోని మాల్దా జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, మలాల్దా జిల్లాకు చెందిన ముర్సెలీమ్ (10) అనే బాలుడు కుటుంబ సభ్యులతో కలిసి గ్రామంలో ఉంటున్నాడు. 
 
శుక్రవారం మధ్యాహ్నం అతడు స్థానికంగా ఉన్న ఓ కుంటలో చేపలు పట్టేందుకు వెళుతుండగా రైలు పట్టాల కింద గొయ్యి కనిపించింది. మరోవైపు, అగర్తల - సియాల్‌గా కాంచన్‌గంజుంగా ఎక్స్‌ప్రెస్ వేగంగా వస్తుండటాన్ని గుర్తించారు. 
 
రాబోయే ప్రమాదాన్ని గ్రహించిన ఆ బాలుడు క్షణం ఆలస్యం చేయకుండా పట్టాల వద్ద నిలబడి తాను ధరించిన ఎర్రని టీషర్టును తీసి గాల్లో ఊపుతూ ట్రెయిన్ లోకోపైలట్‌ను అప్రమత్తం చేశాడు. బాలుడి సిగ్నల్‌ను గమనించిన లోకో‌పైలెట్ వెంటనే రైలును ఆపేశారు. 
 
ఆ తర్వాత ఆ బాలుడు నిలబడిన చోటుకు వచ్చి చూడగా అక్కడ పట్టాల కింద గొయ్యి కనిపించింది. అక్కడి కంకర కొట్టుకుపోవడంతో గొయ్యి ఏర్పడినట్టు గుర్తించారు. దీంతో, వెంటనే రైల్వే అధికారులకు సమాచారం అందించిన ఆయన బాలుడిని అభినందల్లో ముంచెత్తారు. 
 
రైల్వే సిబ్బంది వచ్చి గొయ్యిని పూడ్చిన తర్వాత అంటే ఓ గంట ఆలస్యంగా రైలు బయలుదేరి వెళ్లింది. కాగా, పెను ప్రమాదం తప్పించిన బాలుడి పేరును అవార్డు కోసం సిఫారసు చేస్తామని రైల్వే అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను : జూనియర్ ఎన్టీఆర్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments