Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిర్యానీ ఎంచక్కా లాగించేశారు.. డబ్బులడిగితే.. తుపాకీతో..?

హోటల్ కనిపించింది. బిర్యానీ ఆర్డర్ చేసి ఎంచక్కా లాగించేశారు. అయితే డబ్బులడిగితే మాత్రం వాగ్వివాదానికి దిగారు. అంతటితో ఆగకుండా హోటల్ యజమానిని తుపాకీతో కాల్చిచంపేశారు. ఈ ఘటన పశ్చిమబెంగాల్‌లో చోటుచేసుకుం

Webdunia
మంగళవారం, 5 జూన్ 2018 (13:42 IST)
హోటల్ కనిపించింది. బిర్యానీ ఆర్డర్ చేసి ఎంచక్కా లాగించేశారు. అయితే డబ్బులడిగితే మాత్రం వాగ్వివాదానికి దిగారు. అంతటితో ఆగకుండా హోటల్ యజమానిని తుపాకీతో కాల్చిచంపేశారు. ఈ ఘటన పశ్చిమబెంగాల్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. పశ్చిమబెంగాల్‌‍లో బిర్యానీ లాగించిన కస్టమర్ల వద్ద ప్లేట్‌ బిర్యానీ ఖరీదు రూ.190 ఇవ్వాలని హోటల్‌ యజమాని అడిగాడు. ఈ విషయంపై వాగ్వాదం తలెత్తింది. దీంతో నలుగురు కస్టమర్లలో ఒకరు తుపాకీతో యజమాని సంజయ్‌ని కాల్చి పరారైనారు. ఈ ఘటనలో గాయపడిన సంజయ్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.  
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురు నిందితుల్లో ఒకరిని అరెస్ట్‌ చేశామని, మిగతా వారు పరారీలో ఉన్నారని తెలిపారు. వారి కోసం గాలిస్తున్నామని చెప్పారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి మహమ్మద్‌ ఫిరోజ్‌ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments