Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెస్ట్ బెంగాల్‌లో 10, 12 తరగతుల పరీక్షలు రద్దు : సీఎం మమత వెల్లడి

Webdunia
సోమవారం, 7 జూన్ 2021 (17:56 IST)
కరోనా వైరస్ మహమ్మారి సమయంలో వెస్ట్ బెంగాల్ రాష్ట్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఈ యేడాది 10వ తరగతి (మాధ్యమిక్), 12వ తరగతి (ఉచ్ఛ మాధ్యమిక్) బోర్డు పరీక్షలను పశ్చిమబెంగాల్ ప్రభుత్వం రద్దు చేసింది. 
 
ఈ పరీక్షల రద్దు నిర్ణయాన్ని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ  సోమవారంనాడు ప్రకటించారు. దీనికి ముందు, జూలై చివరి వారంలో 12వ తరగతి బోర్డు పరీక్షలు జూలైలోనూ, 10వ తరగతి బోర్డు పరీక్షలు ఆగస్టు రెండో వారంలోనూ జరుపుతామని మమతా బెనర్జీ ప్రకటించారు. 
 
అయితే, కోవిడ్ తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ పరీక్షలను పూర్తిగా రద్దు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి సోమవారం ప్రకటించారు. కాగా, కేంద్ర ప్రభుత్వం కూడా సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను రద్దు చేసిన విషయం తెల్సిందే.
 
ఇదిలావుంటే, బెంగాల్‌లో ఆదివారం 7,002 మందికి కరోనా పాజిటివ్ రావడంతో మొత్తం కేసుల సంఖ్య 14,26,132కు చేరింది. కొత్తగా 107 మంది మృత్యువాత పడటంతో కరోనా మృతుల సంఖ్య 16,259కి చేరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments