Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగాల్‌లో పెరిగిపోతున్న పాజిటివ్ కేసులు - స్కూల్స్ మూసివేత

Webdunia
సోమవారం, 3 జనవరి 2022 (15:57 IST)
వెస్ట్ బెంగాల్‌ రాష్ట్రంలో కరోనా వైరస్ బెంబేలెత్తిస్తుంది. ఈ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగిపోతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై, ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా, సోమవారం నుంచి పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. 
 
కరోనా కేసులు పెరిగిపోతుండటంతో విద్యా సంస్థలు, జూ పార్కులు, స్విమ్మింగ్ పూల్స్, బ్యూటీ పార్లర్లు, సెలూన్‌లను మూసివేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అలాగే, ప్రభుత్వ కార్యాలయాలు 50 శాతం సిబ్బందితో పనిచేసేలా చర్యలు తీసుకున్నారు. పరిపాలనా పరమైన సమావేశాలను కేవలం వర్చువల్ విధానంలో చేపట్టాలని బెంగాల్ ప్రభుత్వం తాజాగా జారీచేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది. 
 
అలాగే, థియేటర్లు, బార్లు, రెస్టారెంట్లు 50 శాతం కెపాసిటీతో నిర్వహించుకోవాలని కోరింది. మతపరమైన, సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలకు 50 శాతం మందికి అనుమతి ఇచ్చింది. ఇక సమావేశాలకు 200 మంది, వివాహాది శుభకార్యాలకు 50 మందికి అంత్యక్రియలకు 20 మందికి మాత్రమే అనుమతి ఇచ్చింది. కాగా, కోల్‌కతాలో నే గత మూడు రోజుల్లో మూడు రెట్లు, బెంగాల్‌లో 5.47 శాతం కోవిడ్ పాజిటివిటీ రేటు నమోదైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kantara Chapter 1: కాంతార చాప్టర్‌ 1.. రిషబ్ శెట్టి సతీమణి కన్నీళ్లు.. తారక్‌తో రిషబ్ ఫ్యామిలీ వీడియో వైరల్

Pawan Kalyan: దయచేసి సినిమాను చంపకండి, ఒకరినొకరు అభినందించుకోండి.. ఫ్యాన్స్‌కు పవన్ హితవు

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ పుట్టినరోజున సంబరాల ఏటి గట్టు టీజర్‌

Naga Shaurya: అమెరికానుంచి వచ్చిన నాగశౌర్య పై పిల్లనిత్తానన్నాడే సాంగ్ చిత్రీకరణ

Mirai collections: ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లు దాటిన తేజా సజ్జా మిరాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం