Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనతా కర్ఫ్యూ, విరుచుకుపడిన కామాంధులు, నాలుక కొరికేసింది...

Webdunia
మంగళవారం, 24 మార్చి 2020 (13:48 IST)
కరోనా మహమ్మారితో జనాలు జడుసుకుంటుంటే.. కామాంధులు మాత్రం రెచ్చిపోతున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయ్‌గురిలో దారుణం జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై ఇద్దరు కామాంధులు అత్యాచారానికి ప్రయత్నించారు. కానీ బాధితురాలు తీవ్రంగా ప్రతిఘటించింది. ఇంకా కామాంధులపై దాడి చేసింది. ఈ క్రమంలో ఓ కామాంధుడి నాలుకను గట్టిగా కొరికి రెండు ముక్కలు చేసింది.
 
బాధతో విలవిల్లాడిన నిందితుడు ఆమెను వదిలేసి ఆస్పత్రికి పరుగు తీశాడు. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఆదివారం జనతా కర్ఫ్యూ విధించారు. ఇదే సమయంలో రాత్రి 8 గంటల ప్రాంతంలో ఓ మహిళపై రాకీ మొహమ్మద్, చోతు మొహమ్మదుల్లా అనే ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి యత్నించారు.
 
బంధించి బెడ్రూమ్‌లోకి లాక్కెళ్లిన ఇద్దరు నిందితులు తీవ్రంగా కొట్టారు. రాకీ ఆమెపై అత్యాచారానికి పాల్పడుతుండగా బాధితురాలు అతడికి ఎలాగైనా బుద్ది చెప్పాలన్న కోపంతో నాలుకను గట్టిగా కొరికేసింది. అంతే ఒక్కసారే బాధతో విల విలలాడుతూ.. దగ్గరలోని ఆసుపత్రికి పరుగులు తీశాడు బాధితుడు. నాలుకను అతికించలేమని వైద్యులు చేతులెత్తేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments