Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేలిన గ్యాస్ సిలిండర్.. ఒకే కుటుంబంలో ఏడుగురు సజీవదహనం

ఠాగూర్
మంగళవారం, 1 ఏప్రియల్ 2025 (09:10 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఈ రాష్ట్రంలోని 24 పరగణాల జిల్లాలోని ఓ ఇంటిలో గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృత్యువాతపడ్డారు. గ్యాస్ సిలిండర్ పేలిన ఇంటిని బాణాసంచా తయారీ కేంద్రంగా ఉపయోగిస్తూ వచ్చారు. దీంతో ఈ ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. పేలుడు ధాటికి నలుగురు ఆచూకీ తెలియడం లేదు. మరికొందరు గాయపడ్డారు. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. పేలుడు సంభవించిన ఇంటిని కొందరు బాణాసంచా తయారీ కేంద్రంగా ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో గత రాత్రి భారీ శబ్దంతో ఇంట్లో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. 
 
పేలుడు సంభవించి సమయంలో ఇంట్లో 11 మంది ఉండగా, వీరిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురి ఆచూకీ తెలియాల్సివుంది. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. ఈ ప్రమాదంలో మరికొందరు గాయపడ్డారు. సిలిండర్ పేలుడు కారణంగా మంటలు వ్యాపించినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments