Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐఎన్‌ఎక్స్ తీహార్ జైలుకు కార్తి చిదంబరం...

ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కేసులో తదుపరి దర్యాప్తు కోసం కార్తి చిదంబరాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఆదివారం ముంబై తీసుకెళ్ళింది. మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం కుమారుడు కార్త

Webdunia
ఆదివారం, 4 మార్చి 2018 (15:04 IST)
ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కేసులో తదుపరి దర్యాప్తు కోసం కార్తి చిదంబరాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఆదివారం ముంబై తీసుకెళ్ళింది. మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం కుమారుడు కార్తిని ఢిల్లీ సెషన్స్ కోర్టు గురువారం ఐదు రోజుల సీబీఐ కస్టడీకి ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఈనెల 6వ తేదీన కార్తీ చిదంబరంను చెన్నై విమానాశ్రయంలో అరెస్టు చేసిన విషయం తెల్సిందే. 
 
ఐఎన్ఎక్స్ మీడియాకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల మండలి అనుమతులు రావడం వెనుక కార్తి చిదంబరం హస్తం ఉందని సీబీఐ ఆరోపించింది. ఆ సమయంలో ఆయన తండ్రి పి.చిదంబరం యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర ఆర్థికమంత్రిగా పని చేశారని తెలిపింది. సీబీఐ, ఈడీ కార్తిపై మరిన్ని కేసులు దాఖలు చేసే అవకాశం ఉందని ఓ వార్తా సంస్థ తెలిపింది. 
 
ఐఎన్ఎక్స్ మీడియా సహ వ్యవస్థాపకురాలు ఇంద్రాణీ ముఖర్జియా, కార్తి చిదంబరాలను ముంబైలో ఎదురెదురుగా పెట్టి సీబీఐ విచారణ జరుపుతుందని తెలుస్తోంది. పీటర్ ముఖర్జియా, కార్తి చిదంబరాలను కూడా ఇదేవిధంగా ప్రశ్నిస్తారని సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments