Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రహాలపై కష్టాలు పడుతున్నా రక్షిస్తాం : దిమ్మదిరిగేలా రిప్లై ఇచ్చిన సుష్మా స్వరాజ్

భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్. విదేశాల్లో ఉంటూ కష్టాల్లో కూరుకున్న భారతీయులను రక్షించడంలో ముందుంటారు. ఇలాంటి బాధితులను మంత్రి ఆదుకున్న సందర్భాలు కోకొల్లలు. తాజాగా మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్వి

Webdunia
గురువారం, 8 జూన్ 2017 (18:33 IST)
భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్. విదేశాల్లో ఉంటూ కష్టాల్లో కూరుకున్న భారతీయులను రక్షించడంలో ముందుంటారు. ఇలాంటి బాధితులను మంత్రి ఆదుకున్న సందర్భాలు కోకొల్లలు. తాజాగా మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్‌లో ఆమె చేసిన ట్వీట్ ఒకటి వైరల్ అవుతోంది.
 
కరణ్ సైనీ అనే నెటిజన్ సుష్మా స్వరాజ్‌ను ఉద్దేశించిన ఓ ట్వీట్ చేశారు. "నేను మార్స్‌పై చిక్కుకుపోయా. మంగళ్‌యాన్ ద్వారా మీరు పంపిన ఆహారం అయిపోయింది. మంగళ్‌యాన్-II ఎప్పుడు పంపిస్తారు?" అనేది ఆ ట్వీట్ సందేశం. 
 
ఈ ట్వీట్‌ను చూడగానే సుష్మా స్వరాజ్ కూడా తనదైనశైలిలో స్పందించారు. "భారతీయులు ఎక్కడ చిక్కుకున్నా భారత రాయబార కార్యాలయం సాయం చేస్తుంది. చివరికి గ్రహాలపైనైనా" అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఆమె ట్వీట్ వైరల్ అయింది. 
 
అయితే, కరణ్‌పై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. మంత్రితో జోకులేంటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాగా పనిచేసే మంత్రిపై ఇటువంటి అర్థంపర్థం లేని ట్వీట్లేంటంటూ మండిపడుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments