Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాగు చట్టాలను వెనక్కి తీసుకునేంతవరకు ఇళ్లకు వెళ్లం : రాకేశ్‌ తికాయత్‌

Webdunia
సోమవారం, 8 ఫిబ్రవరి 2021 (08:49 IST)
సాగు చట్టాలను వెనక్కి తీసుకునేంత వరకు ఇళ్లకు వెళ్లబోమని భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బికెయు) నేత రాకేశ్‌ తికాయత్‌ స్పష్టం చేశారు.

హర్యానాలోని చార్‌ఖీ దాద్రిలో నిర్వహించిన 'కిసాన్‌ మహా పంచాయత్‌'ను ఉద్దేశించి రాకేశ్‌ తికాయత్‌ ప్రసంగిస్తూ.. వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ కొనసాగుతోన్న అన్నదాతల ఆందోళన ప్రజా ఉద్యమమని, అది ఎప్పటికీ విఫలం కాబోదన్నారు.

రైతులకు మేలు చేయని ఈ చట్టాలను వెనక్కి తీసుకునేంత వరకు ఉద్యమాన్ని ఆపబోమని, ఇళ్లకు వెళ్లబోమని తేల్చి చెప్పారు.

పంట ఉత్పత్తులకు మద్దతు ధర ఇచ్చేలా కొత్త చట్టాన్ని చేయడంతోపాటు ఇటీవల అరెస్ట్‌ చేసిన రైతు నేతలను విడుదల చేసే వరకు తాము ఇళ్లకు వెళ్లే ప్రసక్తే లేదని రాకేశ్‌ తికాయత్‌ స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments