Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రమాదకర స్థాయిలో గంగా - యమున నదులు - నీట మునిగిన ఉత్తరభారతం

Webdunia
సోమవారం, 10 అక్టోబరు 2022 (14:51 IST)
ఉత్తర భారతదేశంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ కుంభవృష్టి కారణంగా ఈ ప్రాంతంలోని అనేక నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా, గంగా, యమున నదులు ప్రమాకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఈ నదుల్లో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగిపోవడంతో త్రివేణి సంగమమైన ఉత్తర్​ ప్రదేశ్​లోని ప్రయాగ్​ రాజ్​ నీట మునిగింది.
 
ఇరు నదులు ఉప్పొంగి ప్రవహించటం వల్ల ప్రయాగ్​రాజ్​లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. దరగంజ్​, సలోరి, బఘద, రాజ్​పుర్​, నైనీ, ఝాన్సీ వంటి ప్రాంతాల్లో మొదటి అంతస్తు నీటిలో మునగటం వల్ల పైఅంతస్తులో తలదాచుకుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. 
 
అనేక ప్రాంతాల్లోని వీధులన్ని నీట మునిగాయి. దీంతో వరద బాధితులను వీధుల నుంచి పడవలపై సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రయాగ్​రాజ్​లో గంగా నది 84.73 మీటర్ల మేర ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. మరోవైపు యమునా నది నైనీలో 83.88 మీటర్ల మేర ప్రవహిస్తోంది. దీంతో ఉత్తరభారత ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments